ఏపీ గురుకుల సంక్షేమ పాఠశాలలో అక్రమాలు | Sakshi
Sakshi News home page

ఏపీ గురుకుల సంక్షేమ పాఠశాలలో అక్రమాలు

Published Wed, Feb 3 2016 7:59 PM

Promotions giving illegally in Gurukula welfare school at Vijayawada

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గురుకుల సంక్షేమ పాఠశాల ప్రమోషన్లలో అక్రమాలు వెలుగుచూశాయి. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జూనియర్ లెక్చరర్ల ప్రమోషన్లలో నిబంధనలను ఉల్లంఘించినట్టు తెలిసింది. జోనల్ పోస్టులను స్టేట్ క్యాడర్ పోస్టులుగా ప్రభుత్వం మార్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

జీవో నెంబర్ 22 వివాదంలో ఉండగానే ప్రభుత్వం ప్రమోషన్లు ఇస్తున్నట్టు విమర్శలు గుప్పుమన్నాయి. ప్రమోషనల్ల ప్రక్రియలో భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురుకులాల చరిత్రలో ఇది బ్లాక్ డే అంటూ కమిషనర్కు జీజీటీఏ నిరసన తెలిపింది.

Advertisement
Advertisement