చంద్రబాబుకు ధైర్యం ఉంటే... | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ధైర్యం ఉంటే...

Published Sun, Aug 2 2015 1:20 PM

చంద్రబాబుకు ధైర్యం ఉంటే... - Sakshi

తిరుపతి : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో రామిరెడ్డి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబుకు ధైర్యం ఉంటే కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

ప్రజలను తప్పదోవ పట్టించడానికి బాబు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధమే అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి రావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగస్టు 10న ధర్నా చేస్తున్నారని వివరించారు.

Advertisement
Advertisement