పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలి | Sakshi
Sakshi News home page

పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలి

Published Tue, Jul 19 2016 7:36 PM

Release PRC pendings

పెద్దశంకరంపేట: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 27న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్‌ బి.శ్రీనివాస్‌ కోరారు. మంగళవారం పేటలో ఎస్టీయూ చలో హైదరాబాద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పీఆర్‌సీ బకాయిలను చెల్లించాలని, డీఎస్సీ నిర్వహించాలని, విద్యకు బడ్జెట్‌లో 30 శాతం నిధులు కెటాయించడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయు మండల అధ్యక్షులు లింగారెడ్డి, ప్ర«ధానకార్యదర్శి రాధాక్రిష్ణ, కుమార్, శంకర్, నారాయణ, సిద్దిరాములు, సంగారెడ్డి, విఠల్‌నాయక్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement