కట్టేసి దోచేశారు! | Sakshi
Sakshi News home page

కట్టేసి దోచేశారు!

Published Wed, Aug 17 2016 10:16 PM

సంఘటన వివరాలు చెబుతున్న లక్ష్మీనారాయణ - Sakshi

జోగిపేట: దుండగులు టైరు పంక్చర్‌ దుకాణదారుడిని కట్టేసి సొత్తు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి అందోలు మండలం రాంసానిపల్లి జాతీయ రహదారిపై జరిగింది. రాంసానిపల్లికి చెందిన సార లక్ష్మీనారాయణ ప్రధాన రహదారిపై టైర్ల పంక్చర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఒంటరిగా అక్కడే గుడిసె వేసుకొని ఉంటున్నాడు.

ఇది గమనించిన ముగ్గురు దుండగులు మంగళవారం అర్ధరాత్రి లక్ష్మీనారాయణ నోరు మూసి పక్కనే ఉన్న పొలాల్లోకి ఎత్తుకెళ్లారు. ఆపై కాళ్లు, చేతులు కట్టేసి అతడి వద్ద ఉన్న 11 తులాల వెండి గొలుసు, ఉంగరం, గుడిసె తాళం చెవి లాక్కున్నారు. అనంతరం గుడిసెలోకి ప్రవేశించి రూ.2 వేలు, పెట్రోలు, గడియారం ఎత్తుకెళ్లారు. తర్వాత లక్ష్మీనారాయణ గ్రామపెద్దలకు ఫోన్‌ చేసి విషయం తెలిపాడు. ఘటనపై కేసు నమోదైంది.

Advertisement
Advertisement