కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మంగళవారం రూ.3.35కోట్లు మంజూరు చేస్తూ జీవో-384 జారీ చేశారు. ఈ నిధులను ఆసుపత్రిలో సివిల్ పనులకు వినియోగించనున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ నిధుల నుంచి ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసింది.
పెద్దాసుపత్రికి రూ.3.35 కోట్లు మంజూరు
Published Tue, Jul 4 2017 10:00 PM
Related news
-
కేఈ శ్యాంబాబుకు సొంతిల్లు లేదట!
కర్నూలు(సెంట్రల్): పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ కుటుంబానికి అమరావతిలో రూ.5.54 కోట్ల విలువ చేసే 38,002 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేదని అఫిడవిట్లో చూపారు. తండ్రి డిప్యూటీ సీఎంగా పనిచేసినా కుమారుడికి మాత్రం సొంతిల్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల ఆయన పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా..తాను ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట కృష్ణగిరి, కంబాలపాడులలో రూ.19.40 లక్షల విలువ చేసే 12.33 ఎకరాల పొలం, రూ.31.79 లక్షల విలువ చేసే ఫార్చునర్ కారు ఉన్నట్లు చూపారు. భార్యకు రూ.32 లక్షల విలువ చేసే 46.58 తులాల బంగారు, రూ.15 లక్షల విలువ చేసే 16.50 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట రూ. 3,23,18,090 చరాస్తులు, భార్యకు రూ..1,32,14,007 చరాస్తులు ఉన్నట్లు చూపారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర రూ.1,19,76,800 అప్పు తీసుకున్నట్లు, తన భార్యకు రూ.19.50 లక్షల అప్పు ఇచ్చినట్లు చెప్పారు. తనపై ఒక్క కేసు కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు ఉన్నాయి. అంతేగాక అతను, అతని భార్య ఎన్.యశోదమ్మకు దాదాపు 31 ఎకరాల పొలాలు ఉన్నాయి. మాధవరంలో ముగ్గురి భాగస్తుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ అతనిపేరిట ఉంది. అతని ఎలాంటి కేసులు లేవని ఎన్నికల ఆఫిడవిట్లో పొందుపరచారు. ఆయనకు రూ.3.92 లక్షల విలువ చేసే 5.6 తులాల బంగారు అభరణాలు, భార్య ఎన్. యశోదమ్మకు రూ.9.10 లక్షల విలువ చేసే 13 తులాల బంగారం అభరణాలు ఉన్నట్లు తెలిపారు. అంతేకాక ఆయన పేరిట రూ.40.70 లక్షల చరాస్తి, భార్యకు రూ.26.26 లక్షల చరాస్తితోపాటు రూ.33 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన పేరిట స్థిరాస్తులు మాత్రం రూ.2.94 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. కుమారుడు రాకే‹Ùరెడ్డి పేరిట 35 లక్షల స్థిరాస్తి, రూ.20 లక్షల చరాస్తి ఉన్నట్లు చూపారు. రాఘవేంద్రారెడ్డికి రూ.1.68 కోట్ల అప్పులు, భార్యకు రూ.21 లక్షల అప్పు ఉన్నట్లు ప్రకటించారు. వై.బాలనాగిరెడ్డికి వ్యవసాయ భూములే ఆస్తులు మంత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.బాలనాగిరెడ్డి, ఆయన భార్య జయమ్మకు కలిపి 44.06 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇందులో బాలనాగిరెడ్డి పేరిట 37.45 ఎకరాలు, భార్య పేరిట 6.61 ఎకరాల పొలం ఉంది. ఆయనకు పేరిట ఒకకారు, భార్య పేరిట మరొక కారు ఉంది. ఆయన రూ.12 లక్షల విలువ చేసే 400 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల విలువ చేసే 10 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య పేరిట రూ.4.85 లక్షల విలువ చేసే 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల విలువ చేసే 5 కేజీల వెండి ఉంది. కాగా, బాలనాగిరెడ్డిపై 2012లో కోసిగి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విచారణలో ఉంది. ఇంతియాజ్కు సొంత వాహనం లేదు సెర్ప్ సీఈఓ, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఏఎండీ ఇంతియాజ్కు సొంత వాహనం లేదు. బుధవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునన కర్నూలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడవిట్లో తనకున్న ఆస్తి వివరాలను ప్రకటించారు. తన చరాస్తిగా రూ.41.36 లక్షలు, భార్య సమీనకు చరాస్తిగా రూ.18.42 లక్షలు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో వారికి విలువైన వాహనాలుగాని, ఖరీదైనా వజ్రాలు, బంగారు, వెండి, అభరణాలేవి లేవు. స్థిరాస్తుల్లో ఆయన భార్య సమీనకు కర్నూలులోని ఎన్ఆర్ పేటలో 378 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇల్లు ఉంది. అలాగే ఆయనకు రాజధాని క్యాపిటల్ సిటీలోని ఐనవోలులో 4500 చదరపు అడుగుల కాళీ స్థలం, ఆయన భార్య సమీనకు కల్లూరులో 2800 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. స్థిరాస్తి విలువలో ఇంతియాజ్కు రూ.30 లక్షలు, ఆయన భార్యకు రూ.30 లక్షలు ఉన్నాయి. మొత్తంగా ఆయనకు చరాస్థిరాస్తులు కలిపి రూ. 71,36,560, ఆయన భార్య సమీనకు 68, 42,603 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆయనపై ఎలాంటి కేసులు లేవు. -
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్డేను వేదికగా చేసుకున్నారు. బర్త్డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు -
ముస్లింలకు అండగా సీఎం జగన్...మళ్లీ అధికారం వైఎస్సార్సీ పీదే
ముస్లింలకు అండగా సీఎం జగన్...మళ్లీ అధికారం వైఎస్సార్సీ పీదే -
చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు: ఇంతియాజ్
చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు: ఇంతియాజ్ -
కర్నూలు: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్గా
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్.నిర్మల. బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్ఎస్సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం. నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. Congratulations to Ms. G. Nirmala from Kasturba Gandhi Balika Vidyalaya (KGBV), Kurnool, a residential girls’ school run by the Ministry of Education for the disadvantaged sections in India, for securing the top spot in the 1st Year Intermediate exam of Andhra Pradesh… pic.twitter.com/OVqEX0frQL — Ministry of Education (@EduMinOfIndia) April 13, 2024
Related News by category
-
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్డేను వేదికగా చేసుకున్నారు. బర్త్డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు -
నేడు తర్తూరు రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: త ర్తూరు శ్రీ లక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓఏడీ వెంకటరమణ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంతో అలంకరించిన ప్రభోత్సవ రథంపై కొలువుంచారు. అనంతరం గ్రామోత్సవంలో ప్రజలు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
ఓటు తప్పకుండా వేస్తా
నేను బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. దరఖాస్తును ఆమోదించి ఓటరుగా నమోదు చేశారు. స్మార్ట్ ఎపిక్ కార్డు కూడా వచ్చింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు ఓటు లభించింది. పోలింగ్ రోజు ఎన్ని పనులున్నా.. ఓటు తప్పకుండా వేస్తాను. స్వేచ్ఛగా, నిర్ఛయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాను. – పి.లక్ష్మిచేతన రెడ్డి, వీనస్ కాలనీ, కర్నూలు ● -
స్నేహితులతో కూడా ఓటు వేయిస్తా
ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడంతోనే అమోదించి ఓటరుగా నమోదు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో నా ఓటు నేను స్వేచ్ఛగా వినియోగించుకుంటాను. పాలకులు మంచివారైతే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటువేస్తాను. మొదటి సారిగా ఓటు వేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఓటు వేస్తా... నా స్నేహితులతో కూడా ఓటు వేయిస్తాను. – గుర్రం చేతన లాస్య, చాణుక్యపురి కాలనీ, కర్నూలు -
మంచి పాలనకే ‘తొలి’ ఓటు!
● నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాం ● ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగం ● పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది ● తొలిసారిగా ఓటు వేయబోతున్న యువత మనోగతం కర్నూలు(అగ్రికల్చర్): మంచి పాలన అందించే వారికే తాము ఓటు వేస్తామని తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు చెబుతున్నారు. పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి వారినే తాము ఎన్నుకుంటామని పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో 20.14 లక్షలు, నంద్యాల జిల్లాలో 13.94 లక్షలు.. మొత్తం 34.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18, 19 ఏళ్ల యువత 1,71,215 మంది ఉన్నారు. అయితే ఇందులో 87,285 మంది ఓటర్లుగా నమోదయ్యారు. మే నెల 13న నిర్వహించే శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 49,741, నంద్యాల జిల్లాలో 37,844 మంది మొద టి సారిగా ఓటు వేయనున్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వీరు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే వారిని, అభివృద్ధి చేసేవారని గెలిపిస్తామని చెబుతున్నారు. ఈ సారి పెరగనున్న ఓటింగ్ శాతం.. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఎన్నికల కమిషన్ పిలుపు నిస్తోంది. ఇందులో భాగంగా స్వీప్ కార్యక్రమాలను అధికారులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. 2019 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఓటింగ్కు 50 శాతం వరకు యువత దూరంగా ఉంటోంది. ఈ సారి ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా యువఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. నియోజక వర్గం 18–19 ఏళ్ల యువ ఓటర్లు కర్నూలు 6,425 పాణ్యం 8,250 పత్తికొండ 5,678 కోడుమూరు 5,947 ఎమ్మిగనూరు 6,483 మంత్రాలయం 5,429 ఆలూరు 5,749 శ్రీశైలం 8,349 నంద్యాల 6,709 బనగానపల్లె 6,402 ఆదోని 5,510 ఆళ్లగడ్డ 5,247 డోన్ 5,488 నందికొట్కూరు 5,609 మొత్తం 87,275
Advertisement
Photos
View allVideo
View allఅతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement