తుది సమరానికి సై...! | Sakshi
Sakshi News home page

తుది సమరానికి సై...!

Published Sat, Nov 19 2016 5:17 PM

తుది సమరానికి సై...!

- రసవత్తరంగా క్వార్టర్, సెమీఫైనల్‌ పోటీలు
– జిల్లా అధికారులను ఘనంగా సన్మానించిన నిర్వాహకులు
– నేడు ఫైనల్‌ మ్యాచ్‌లు


కడప స్పోర్ట్స్‌ :

ఆలిండియా బ్యాడ్మింటన్‌ సీనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు తుదిదశకు చేరుకున్నాయి. శనివారం ఉదయం క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు ముగిశాయి. సాయంత్రం నుంచి సెమీఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. ఆదివారం ఉదయం తుదిపోరుకు యువ రాకెట్‌లు సన్నద్ధమవుతున్నాయి. 5 రోజుల పాటు కడప క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఈ టోర్నమెంట్‌ ఆదివారంతో ముగియనుంది  ఫైనల్‌మ్యాచ్‌ల నిర్వహణ ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్‌ సమయంలో క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు క్లాపర్స్‌ను వినియోగించనున్నారు.
జిల్లా అధికారుల సేవలకు సత్కారం..
ఆలిండియా బ్యాడ్మింటన్‌ సీనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌–2016ను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రానికి జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. బ్యాడ్మింటన్‌ ఆఫ్‌ ఇండియా (ఈవెంట్స్‌) కార్యదర్శి సీ.కె. పున్నయ్యచౌదరి జిల్లా అధికారులకు శాలువ కప్పి, పూలబొకే, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారిలో డీఈఓ బి. ప్రతాప్‌రెడ్డి, కడప ఆర్‌డీఓ చిన్నరాముడు, సీపీఓ తిప్పేస్వామి, కమిషనర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి, డీఎస్‌డీఓ లక్ష్మినారాయణశర్మ, ఎస్‌ఎస్‌ఏ పీఓ వెంకటసుబ్బయ్య, సహకారశాఖ అధికారి యధుభూషణ్‌రెడ్డి, డీఆర్‌డీఏ ఏపీడీ నాగరాజు, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, చీఫ్‌ రెఫరీ బ్రజేష్‌గౌర్, రెఫరీ రామకృష్ణ, సోషల్‌వెల్ఫేర్‌ డీడీ సరస్వతి, బోగా చిన్నయ్య ఉన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ బాషాఖాన్, జిల్లా కార్యదర్శి ఎస్‌. జిలానీబాషా, కోశాధికారి నాగరాజు, ఉపాధ్యక్షులు శశిధర్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌రెడ్డి, మునికుమార్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సంయక్త కార్యదర్శులు మదన్‌మోహన్‌రెడ్డి, రెడ్డిప్రసాద్, మనోహర్, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement