నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Published Wed, Jun 8 2016 4:28 PM

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

నవిపేట(నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్‌ జిల్లాలో నవిపేట మండలం మిట్టాపూర్ వద్ద బుధవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నిజామాబాద్‌ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు, బాసర నుంచి వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురు మార్గమధ్యంలో చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

మృతులంతా నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ఆదర్శ్‌నగర్ వాసులుగా గుర్తించారు. బాసర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement