వేడుకగా ఊంజల్‌ సేవ | Sakshi
Sakshi News home page

వేడుకగా ఊంజల్‌ సేవ

Published Mon, Aug 8 2016 11:03 PM

వేడుకగా ఊంజల్‌ సేవ - Sakshi

విజయవాడ కల్చరల్‌ : కృష ్ణపుష్కరాల సందర్భంగా స్వరాజ్య మైదానంలో టీటీడీ( తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్మించిన నమూనా దేవాలయం ఊంజల్‌ సేవ సోమవారం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పల్లకీసేవ, ఉంజల్‌సేవలో కంచిపీఠ ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. స్వామికి టీటీడీ దేవాలయ ప్రత్యేక అధికారి శేషాద్రి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. వెంకటేశ్వరుడి పూజలో స్వామి స్వయంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ విశేషాలను శేషాద్రి స్వామికి  వివరించారు.
 

Advertisement
Advertisement