ఖోఖో ఆడుతూ విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

ఖోఖో ఆడుతూ విద్యార్థి మృతి

Published Sat, Jan 23 2016 4:19 PM

Student dies while playing Kho Kho

బత్తులపల్లి (వరంగల్) : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం బత్తులపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న గుమ్మడి విజయ్‌ కుమార్(13) శనివారం మధ్యాహ్నం ఖోఖో ఆడుతూ ఆయాసంతో కింద పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే వైద్యుడిని తీసుకొచ్చేలోపే విద్యార్థి మృతిచెందాడు. విద్యార్థి ఆకస్మిక మృతితో పాఠశాలలోని టీచర్లు, సహ విద్యార్థులంతా విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
Advertisement