♦ జిల్లాలో మైనర్ పంచాయలకు గుదిబండగా మారిన విద్యుత్ బిల్లులు
♦ మూడున్నరేళ్లవుతున్నా కనిపించని టీడీపీ వాగ్దానం
♦ అక్టోబర్ 2లోపు విద్యుత్ బకాయిలు చెల్లించకుంటే చలో అమరావతి
♦ సన్నద్ధం అయిన సర్పంచ్లు
ఒంగోలు టూటౌన్ :
‘మైనర్ గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసి విధంగానే భరిస్తాం. ఒక్క రూపాయి కూడా పంచాయతీలు చెల్లించవద్దు’ ఈ హామీని 2014 ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. దీనిని నాటి ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటినా నేటికీ ఆ హామీ అమల్లోకి రాలేదు.
పేరుకుపోతున్న బకాయిలు
ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ నోటీసులను పంపిస్తూ హెచ్చరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఏయే పంచాయతీ ఎంతెంత చెల్లించాలో అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. దీనిపై మైనర్ గ్రామ పంచాయతీల సర్పంచ్లు, కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీలకు అనుకున్న ఆదాయం లేకపోవడం విద్యుత్ బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్నాయి.
1030 పంచాయతీలు
జిల్లాలో మొత్తం 1030 గ్రామ పంచాయతీలుండగా వీటిలో మైనర్ గ్రామ పంచాయతీలు 750 పైగా ఉన్నాయి. రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పైగా ప్రతి నెలా విద్యుత్ బిల్లులు వస్తుంటాయి. అయితే స్థానికంగా వచ్చే ఆదాయం అంతగా లేకపోవడంతో దశాబ్దాలుగా పంచా యతీ పాలకవర్గాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కేవలం కేంద్రం అభివృద్ధి పనులకు విడుదల చేసే 13, 14వ ఆర్థిక నిధులు తప్ప.. మరొక ఆదాయం రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించాలని అడుగుతుండటంతో సర్పంచులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
రూ. 20 కోట్లు?
2014 డిసెంబర్ చివరిలో ఒక దఫా జిల్లా వ్యాప్తంగా పాతబకాయిలను చెల్లించినట్లు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి. వీరభద్రాచారి తెలిపారు. తిరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన బకాయిల చెల్లింపుల గురించి చర్చకు రాలేదని తెలిపారు. ప్రస్తుతం దాదాపు రూ.20 కోట్ల వరకు బకాయిలుంటాయని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో మైనర్ పంచాయతీలకు విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లిస్తామన్న బాబు తన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న విద్యుత్ బకాయిలు చెల్లించడానికి మైనర్ పంచాయితీలకు తగిన ఆదాయం లేదని తెలిపారు. బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టకపోతే అక్టోబర్ 2 న చలో అమరావతి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దీనికి సర్పంచలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
‘పెండింగ్’ పవర్..!
Published Tue, Sep 5 2017 1:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement