ప్రొద్దుటూరు టీడీపీ సమావేశం రసాభాస | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరు టీడీపీ సమావేశం రసాభాస

Published Sun, Jun 19 2016 8:28 PM

ప్రొద్దుటూరు టీడీపీ సమావేశం రసాభాస - Sakshi

ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి ఆధిపత్య పోరుకు దిగారు. ప్రొద్దుటూరులోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఆదివారం టీడీపీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నేతల వాగ్వాదంతో రసాభాసగా మారింది.

పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరదరాజులురెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగారు. సమన్వయ కమిటీలో సభ్యులుగా వరదరాజులు తన మనుషులనే నియమించుకుంటున్నారని... పార్టీనే నమ్ముకున్న కార్యకర్త ఒక్కరికీ చోటు కల్పించడం లేదని లింగారెడ్డి ఆరోపించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో ఘర్షణ వాతావరణానికి దారితీసింది. దీనిపై అధిష్టానికి ఫిర్యాదు చేస్తానని లింగారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరువురి నేతలకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.

Advertisement
Advertisement