రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

Published Sat, Nov 5 2016 11:20 PM

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ముద్దనూరు: స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం ప్రాంతానికి చెందిన నాగరాజు(35) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యర్రగుంట్ల రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ దేవదానం సమాచారం మేరకు నాగరాజు మద్యానికి బానిసై అనారోగ్యం పాలయ్యాడు. ఈ నేపథ్యంలో కడుపు నొప్పి తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement