భీమవరం టౌన్ : భీమవరంలో శనివారం జరిగిన భారీ చోరీ మిస్టరీని పోలీసులు ఛేదించారు. కారు డ్రైవరే నిందితుడని తేల్చారు. అతని వద్ద నుంచి రూ.15లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను భీమవరం టూటౌన్ పోలీస్స్టేçÙన్లో సోమవారం నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. భీమవరం టూటౌన్ ఆదర్శ నగర్కు చెందిన గాదిరాజు శ్రీనివాసరాజు ఈనెల 15న ఉదయం రాజస్థాన్ వెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం ఆయన భార్య కృష్ణకుమారి ఇంటికి తాళం వేసి శివరావు పేటలోని తన సోదరి ఇంటికి కారులో వెళ్లారు. ఆమెను అక్కడ దింపిన కారు డ్రైవర్ దారం మోహనరావు ఇంట్లో మొక్కలకు నీళ్లు పోసి వస్తానని చెప్పి వచ్చేశాడు. ఇంటి వద్ద యజమానులు ఎవరూ లేక పోవడంతో డ్రైవర్ మోహనరావు అంతకుముందే కారు డ్యాష్ బోర్డులోంచి దొంగిలించిన ఇంటి తాళాలతో తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. బెడ్రూంలోని అల్మరాలో ఉన్న లాకర్ను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించిన కృష్ణకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో డీఎస్పీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సీఐ ఎం.రమేష్బాబు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం చినఅమిరం గ్రామం కొత్తపేటలో డ్రైవర్ మోహనరావును అతని ఇంటి వద్దే అదుపులోకి తీసుకుని సీఐ రమేష్బాబు విచారించారు. దీంతో నేరాన్ని మోహనరావు అంగీకరించాడు. మూడేళ్లుగా శ్రీనివాసరాజు ఇంట్లో మోహనరావు నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతను దొంగిలించిన లాకర్ను తన ఇంట్లో భద్రపరిచాడు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాకర్లో ఉన్న 70 కాసుల బంగారు ఆభరణాలు, రూ.50వేలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన తర్వాత రోజు వ్యవధిలోనే కేసును ఛేదించిన సీఐ ఎం.రమేష్బాబు, ఎస్సై బి.సురేంద్రకుమార్, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ ఎస్.కె.జిలాని, కానిస్టేబుళ్లు బాబూరావు, ప్రసాద్ను డీఎస్పీ అభినందించారు.
డ్రైవరే నిందితుడు
Published Tue, Oct 18 2016 12:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement