ద్విచక్రవాహనాలు ఢీ..ముగ్గురి దుర్మరణం | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనాలు ఢీ..ముగ్గురి దుర్మరణం

Published Tue, Mar 14 2017 11:08 AM

Three Killed In road Accident

కుప్పం (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా కుప్పం శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది

ఈ సంఘటనలో చిత్తూరుకు చెందిన సుధాకర్‌, జ్ఙానేశ్వర్‌, సురేష్‌ అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రున్నికుప్పం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Advertisement
Advertisement