మద్యం మత్తులో ఆటో నడిపి.. | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఆటో నడిపి..

Published Wed, Oct 12 2016 1:01 PM

Three serious injuries in a road accident

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయాలపాలయ్యారు. పట్టణ సమీపంలో రెండు బైక్‌లుఎదురెదురుగా ఢీకొన్నాయి. కిందపడిన వారిని బాటసారులు పైకి లేపుతుండగా వేగంగా వచ్చిన ఆటో వారిపైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో మోహన్ అనే యువకుడి కాలు విరగ్గా మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో స్థానికులు ఆటో డ్రైవర్ మానె వెంకటేశ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులను లక్సెట్టిపేట్ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
Advertisement