మహానందిలో పిడుగుపాటు | Sakshi
Sakshi News home page

మహానందిలో పిడుగుపాటు

Published Mon, May 8 2017 12:16 AM

thunder in mahanandi

- ముగ్గురికి గాయాలు
- పార్వతీపురం తాటిచెట్టుపై మంటలు
 
మహానంది: శిరివెళ్ల మండలం గంగవరం గ్రామానికి చెందిన వారి వివాహ వేడుకల సందర్భంగా నాగనంది సదనం వద్ద వంటలు చేస్తున్న సమయంలో పిడుగుపాటు సంభవించడంతో గంగవరానికి చెందిన పడకండ్ల బ్రహ్మం, కురిచేడుకు చెందిన రామాంజి, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిడుగుపాటు కారణంగా అక్కడే ఉన్న చెట్టుపై మంటలు చెలరేగాయి. 
 

Advertisement
Advertisement