కోదండరాంను విమర్శించే అర్హత లేదు | Sakshi
Sakshi News home page

కోదండరాంను విమర్శించే అర్హత లేదు

Published Sun, Feb 26 2017 10:45 PM

కోదండరాంను విమర్శించే అర్హత లేదు

హన్మకొండ:  తెలంగాణ అభివృద్ధి, నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న తెలంగాణ జేఏసీ చైర్మన్  కోదండరాంను విమర్శించే అర్హత ప్రజాసంఘాలకు లేదని తెలంగాణ విద్యార్థి సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు తిరునహరి శేషు అన్నా రు.  ఈమేరకు శనివారం హన్మకొండ నక్కలగుట్టలో తెలంగాణ విద్యార్థి సేనా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన లక్ష్యం కోసం కోదండరాం పోరాటం చేస్తుంటే కలిసి రావాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నా రు. సమావేశంలో నాయకులు ఎర్రబొజ్జ రమేశ్, పాలడుగుల సురేందర్, కల్లూరి పవన్, తంగెళ్లపల్లి పూర్ణేందర్, కి రణ్, క్రాంతి, రాకేష్, విజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement