ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌

Published Wed, Sep 20 2017 10:56 PM

two inter district thieves arrest

అనంతపురం సెంట్రల్‌: ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగలను అనంతపురం త్రీటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మురళీకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తూర్పు కండ్రిగ గ్రామానికి చెందిన సురేష్, ఈశ్వరయ్యలు అనంతపురం కేంద్రంగా దొంగతనాలకు పాల్పడేవారు. త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోనే వారిపై మూడు కేసులు నమోదయ్యాయి. నిందితులు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 1.50 లక్షలు విలువ జేసే బంగారు వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement