-
ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అనంతపురం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మురళీకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తూర్పు కండ్రిగ గ్రామానికి చెందిన సురేష్, ఈశ్వరయ్యలు అనంతపురం కేంద్రంగా దొంగతనాలకు పాల్పడేవారు. త్రీటౌన్ పోలీస్స్టేషన్లోనే వారిపై మూడు కేసులు నమోదయ్యాయి. నిందితులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 1.50 లక్షలు విలువ జేసే బంగారు వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. -
అంతర్ జిల్లాల దొంగల ముఠా అరెస్టు
నిజామాబాద్క్రైం, న్యూస్లైన్: బంగారు దుకాణాల గోడలకు కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడే అంతర్ జిల్లాల దొంగల ముఠాను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువ చేసే ఆభరాణాలను స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ కేవీ మోహన్రావు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 15న నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో బంగారు దుకాణల సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని జిల్లా సీసీఎస్, స్థానిక పోలీ సులు పట్టుకున్నారు. విచారణలో నిందితులను మహారాష్ట్రకు చెందిన రపన్వాడ్ శంకర్,బదుల్కర్ వెంకటి, డ్యారంగుల దశరథ్లుగా గుర్తిం చారు. నిందితులు జిల్లాలోని ఆర్మూర్తో పాటు కరీంనగర్ జిల్లా జగిత్యాల, మెదక్ జిల్లా తుఫ్రాన్లతో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి మూడు నెక్లెస్లు, రెండు పెద్ద నెక్లెస్ లు, కొన్ని జతల చెవి రింగులు, ఒక జత కడియాలు, పెద్ద గొలుసు తదితర ఆభరణాలతో పాటు కొన్ని వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.దొంగల ముఠాకు చెందిన మరో ముగ్గురు నిందితులు డ్యారంగు ల చంద్రకాంత్, సంపంగుల గోవింద్, జాదవ్ శంకర్లు పరారీలో ఉన్నారని ఆయన వివరించారు. దొంగలను పట్టుకోవడంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ మురళీమనోహర్, ఆర్మూర్ సీఐ ఎస్.లక్ష్మినారాయణ, సీసీఎస్, ఆర్మూర్ ఏఎస్సై లు టి.రాజన్న, ఏ.రాజేశ్వర్గౌడ్, సిబ్బంది ఎస్.దయాల్సింగ్, కె నర్సింగ్రాథోడ్, డి.శ్రీనివాస్రెడ్డి, తిరుపతి, బి.రాము, ఎన్.రాజ్కుమార్, ఎం.గజేందర్, కె ఎల్లారెడ్డి, సీహెచ్. నరేష్కుమార్, డి ఉదయ్కుమార్, ఎం.రాజశేఖర్, సీహెచ్.రమేష్,ముత్యం, శాంతికుమార్, టి.సాయరెడ్డి, సీహెచ్ రాజేశ్వర్, ఎస్.గంగాధర్రావు, ఎం.శ్రీనివాస్, నాగభూషణం ప్రతిభ కనబరిచారని ఎస్పీ తెలిపారు. వీరికి నగదు ప్రోత్సాహక బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను ఇవ్వనున్నట్లు చెప్పారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా బుమ్రా
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
- కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
Advertisement