Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కారు : ఇద్దరు దుర్మరణం

Published Fri, Aug 26 2016 12:50 AM

two people shot died in road accident

 
ముత్తుకూరు : మోటారు బైక్‌ (ఏపీ26ఎం 6433)ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గురువారం రాత్రి 11.40 గంటలకు మండలంలోని కనేటమ్మ ఆలయ ం వద్ద ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు..  25 ఏళ్ల యువకుడు,  35 ఏళ్ల వ్యక్తి మోటార్‌ బైక్‌పై ముత్తుకూరు నుంచి నెల్లూరు వైపు బయల్దేరారు. ముత్తుకూరు రోడ్డులో మ ల్లూరు సమీపంలోని కనేటమ్మ ఆలయం వద్ద నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు వస్తున్న కారు మోటారుసైకిల్‌ను ఢీకొంది. ప్రమాదంలో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి రోడ్డు వైపు ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ప్రమాదం అనంతరంలో కారులో ప్రయాణిస్తున్న వారు పరారయ్యారు. మృతుల వివరాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement