ముత్తుకూరు : మోటారు బైక్ (ఏపీ26ఎం 6433)ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గురువారం రాత్రి 11.40 గంటలకు మండలంలోని కనేటమ్మ ఆలయ ం వద్ద ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. 25 ఏళ్ల యువకుడు, 35 ఏళ్ల వ్యక్తి మోటార్ బైక్పై ముత్తుకూరు నుంచి నెల్లూరు వైపు బయల్దేరారు. ముత్తుకూరు రోడ్డులో మ ల్లూరు సమీపంలోని కనేటమ్మ ఆలయం వద్ద నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు వస్తున్న కారు మోటారుసైకిల్ను ఢీకొంది. ప్రమాదంలో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి రోడ్డు వైపు ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ప్రమాదం అనంతరంలో కారులో ప్రయాణిస్తున్న వారు పరారయ్యారు. మృతుల వివరాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీకొన్న కారు : ఇద్దరు దుర్మరణం
Published Fri, Aug 26 2016 12:50 AM
# Tag
Related news
-
సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
కొవ్వూరు: వేగంగా వెళ్తున్న లారీ సడన్గా బ్రేక్ వేసి రోడ్డు పక్కకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఐషర్ వ్యాన్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాపవరం సమీపంలో నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ దిగువన శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఏలూరు నగరానికి చెందిన మేడం వినోద్ (32) సభలకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేసే పనిచేస్తుంటాడు.వినోద్కు భార్య, కుమారుడు ఉన్నారు. తన వృత్తిలో భాగంగా గుంటూరులో సభకు సౌండ్ సిస్టం అమర్చిన వినోద్ తిరిగి విశాఖపట్నం సమీపంలోని చోడవరంలో కార్యక్రమానికి సౌండ్ సిస్టంను తీసుకెళ్తున్నారు. ఈ సౌండ్ బాక్స్లను తీసుకుని ఏలూరుకు చెందిన మరో ఏడుగురితో చోడవరానికి ఐషర్ వ్యాన్లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు మండలం కాపవరం సమీపానికి వచ్చేసరికి హైవేపై ఫ్లైఓవర్ దిగువన జగ్గయ్యపేట నుంచి ఒడిశా రాష్ట్రానికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో పాటు, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా రోడ్డు మార్జిన్లోకి వెళ్లింది.అప్పటికే వెనుక ఉన్న ఐషస్ వ్యాన్ అదుపు తప్పి వెనుక నుంచి లారీని ఢీకొంది. ఈ ఘటనతో మేడం వినోద్, అతని సహచరుడు దారబోయన ప్రభాకర్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్లో ఉన్న ఏలూరు పట్టణానికి చెందిన మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు ప్రభాకర్కు ఇంకా వివాహం కాలేదు. అదే కారణం.. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. సడన్గా బ్రేక్ వేయడం, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకపోవడం, రోడ్డు మార్జిన్లోకి లారీని ఒక్కసారిగా తిప్పేయడంతో వెనుక వస్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని అంటున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్ను క్రమబదీ్ధకరించారు. -
Dogs Attack: నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి
మలక్పేట: నగరంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం మలక్పేటలోని మూసారంబాగ్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో నాలుగేళ్ల బాలుడు ఉజ్వల్ కుమార్పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తాను ఇంట్లోంచి బయటి రాకపోతే కుమారుడి ప్రాణాలు దక్కేవి కావని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేయడం ఈ ఘటన తీవ్రతకు అద్దంపడుతోంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి మండలం వీరపల్లి పేట గ్రామానికి చెందిన జంపన సాయికుమార్, అలేఖ్య దంపతులు బతుకుదెరువు కోసం వచ్చి మూసారంబాగ్లో నివాసం ఉంటున్నారు.వీరికి ఉజ్వల్కుమార్ (4), ఆరు నెలల వయసున్న మరో బాబు ఉన్నారు. శనివారం సాయంత్రం చిన్న కుమారుడికి అలేఖ్య పాలు తాపుతుండగా.. ఉజ్వల్కుమార్ నిద్ర లేచి అపార్ట్మెంట్ గేట్ వైపు వెళ్తుండగా వీధి కుక్కలు వచ్చి అతనిపై దాడిచేశాయి. మొదట కుడికాలు పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ వెళ్లి బాలుడి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచాయి. బాలుడు గట్టిగా ఏడ్వడంతో గదిలోంచి తల్లి బయటికి వచి్చంది. అప్పటికే కుక్కలు బాలుడిని కరుస్తున్నాయి.ఆమె కేకలు వేస్తూ వాటిని కట్టెతో కొట్టి వెళ్లగొట్టింది. బాలుడి ముఖంపై, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో ఒళ్లంతా రక్తంతో తడిసి పోయింది. చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉజ్వల్కుమార్ ముఖానికి వైద్యులు చికిత్స చేశారని, 10 కుట్లు వేశారని తండ్రి సాయికుమార్ తెలిపారు. గది నుంచి బయటికి రావడం ఆలస్యమైతే తమ కొడుకును కుక్కలు చంపేసి ఉండేవని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడదను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. -
Neha Hiremath murder: నేహా హత్య కేసు నిందితునికి డీఎన్ఏ పరీక్ష
హుబ్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు నిందితుడు ఫయాజ్ రక్త నమూనాను సీఐడీ దర్యాప్తు అధికారులు న్యాయమూర్తి సమక్షంలో సేకరించారు. నిందితునిపై మరింత దర్యాప్తు, అతని డీఎన్ఏ పరీక్ష చేయడానికి అనుమతి కోరి సీఐడీ అధికారులు హుబ్లీ 1వ అదనపు సెషన్స్ కోర్టులో అర్జీ వేశారు. ఈ నేపథ్యంలో జడ్జి సమక్షంలో వైద్యులు ఫయాజ్ రక్త నమూనాలను సేకరించారు. హత్య జరిగిన స్థలం, హత్యకు వాడిన చాకుపై రెండు రక్తపు గ్రూప్లను కనుగొన్నారు. ఒక రక్త గ్రూప్ నేహాది అయితే, మరొకటి ఫయాజ్ది కావచ్చని, కత్తితో పొడిచేటప్పుడు అతనికి స్వల్ప గాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు అధికారులు ఫయాజ్ డీఎన్ఏ పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. కాగా ఫయాజ్ను సీఐడీ బృందం 6 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి విదితమే. సోమవారంతో కస్టడీ గడువు ముగియనుంది. అతన్ని మరింతగా విచారించడానికి కస్టడీ గడువును పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. -
దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
సబ్బవరం: సాలాపువానిపాలెంలో ఓ యువకుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ప్రియుడిపై మోజులో మరో ఇద్దరితో కలిసి కోడలే కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన మండలంలోని గోటివాడ శివారు సాలాపువానిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ పిన్నింటి రమణ శనివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం... సాలాపు శ్రీనివాసరావు (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించడం... అనంతరం కలిసి జీవించడం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా... అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకుని మంచం కోడితో తలపై దాడి చేశారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతోపాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా... శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో పడి వున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు శ్రీనివాసరావును హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు తలపై మంచం కోడితో దాడి చేసిన తర్వాత... సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. -
Hyderabad: రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి
మూసాపేట: ఆసుపత్రికి స్కూటీపై వెళుతున్న స్టాఫ్ నర్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన ప్రశాంతి (37) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీహెచ్బీ కాలనీలోని రవి హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. శనివారం జగద్గిరిగుట్టలోని ఇంటి నుంచి ఆసుపత్రికి సౌత్ ఇండియా షాపింగ్మాల్ నుండి వెళుతోంది. నెక్సాస్ షోరూమ్ వద్ద మలుపు వద్ద కూకట్పల్లి వైపు వేగంగా వెళుతున్న వెనుకనుంచి వచి్చన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Related News by category
-
ఆత్మకూరును అభివృద్ధి చేస్తాం
● మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మర్రిపాడు: ‘ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సంక్షేమ ప్రభుత్వం కొనసాగేందుకు అందరూ సహకరించాలి’ అని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. మండలంలోని చిన్న అల్లంపాడు, పెద్ద అల్లంపాడు గ్రామాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పలువురికి ప్యాకేజీలు ఇచ్చి ప్రలోభాలకు గురిచేశారన్నారు. దీని వల్ల వైఎస్సార్సీపీకి మేలు చేకూరిందన్నారు. అనేకమంది విక్రమ్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారన్నారు. ఏఎస్పేటలో జరిగిన కార్యక్రమంలో ఆనం చేసిన వ్యాఖ్యలపై సవాల్ చేస్తున్నామన్నారు. వేమిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాతే ఆత్మకూరులో రామనారాయణరెడ్డి తిరుగుతున్నారని చెప్పారు. వెంకటగిరికి వెళ్లిపోయాడని, వేమిరెడ్డి అందజేసిన ప్యాకేజీతో ఆనం ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఆయనకు త్వరలోనే సరైన సమాధానం చెబుతామన్నారు. అలాంటి వారిని ప్రజలు నమ్మరని, వైఎస్సార్సీపీని ప్రజలంతా మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు, దశరథరామిరెడ్డి, గువ్వల వెంగళరెడ్డి, చెన్ను వెంకటేశ్వరరెడ్డి, మౌలాలి, హజరత్రెడ్డి, దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్రెడ్డి, రేవూ రు వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముమ్మరంగా తనిఖీలు నెల్లూకరు(క్రైమ్): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణా కట్టడికి పోలీసు, సెబ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళ, బుధవారాల్లో మనుబోలు పోలీసుస్టేషన్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెంకటాచలసత్రం పరిధిలో 19, ఇందుకూరుపేటలో 10, సైదాపురంలో ఆరు మద్యం బాటిళ్లు, సెబ్ అధికారులు 195 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కండలేరులో 7.636 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 7.636 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. హెడ్రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగకు 250 క్యూసెక్కులు, పిన్నేరువాగుకు 5, లోలెవల్ కాలువకు 25 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
No Headline
నామినేషన్లు వేయాల్సిన కార్యాలయాలు నియోజకవర్గం నెల్లూరు లోక్సభ కలెక్టర్ చాంబర్ నెల్లూరు సిటీ కార్పొరేషన్ నెల్లూరు రూరల్ ఆర్డీఓ కందుకూరు సబ్ కలెక్టర్ కావలి ఆర్డీఓ ఆత్మకూరు మున్సిపల్ కోవూరు తహసీల్దార్ సర్వేపల్లి ఎంపీడీఓ ఉదయగిరి తహసీల్దార్ -
టీడీపీకి ఓట్లేస్తే చీకటి రోజులు తప్పవు
● కావలి ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి కావలి: ‘తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే చీకటి రోజులు తప్పవు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. పట్టణంలోని వెంగళరావునగర్లో బుధవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్సీపీ స్థాపించిన నాటి నుంచి ముస్లింలు అండగా ఉన్నారన్నారు. 2019లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారన్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారన్నారు. ఆయన రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. కర్నూలు వంటి కీలక స్థానాల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారన్నారు. అదే విధంగా కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లోనూ ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రకు ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. చంద్రబాబు మతతత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో షేక్ నాయబ్ రసూల్, మొగల్ సలీం బేగ్, మొగల్ రహీం బేగ్, పఠాన్ నవాజ్ ఖాన్, షేక్ ఫీర్ మహమ్మద్, నాయబ్ రసూల్, షేక్ అబ్దుల్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానికుడిని.. మీకేం కావాలో నాకు తెలుసు
పొదలకూరు: ‘నేను స్థానికుడిని. మండలంలో ప్రతి గ్రామం గురించి తెలుసు. మీకేం కావాలో ఐడియా ఉంది. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అలియాస్ అల్లీపురంరెడ్డి అవకాశం కోసం వస్తున్నాడు. ఆయన్ను నమ్మొద్దు. ఎన్నికలయ్యాక కనిపించడు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆల్తుర్తి, ఆర్వైపాళెం, అంకుపల్లి, వెంకటాపురం, పర్వతాపురం, పులికల్లు, వావింటపర్తి, ఊసపల్లి గ్రామాల్లో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రైతులు, పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ వారిని మోసం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం జరిగిందన్నారు. ప్రతి వీధిలో సిమెంటురోడ్లు, సైడ్ డ్రెయిన్లు నిర్మించామన్నారు. అధికారం చేజిక్కించుకునేందుకు చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసి వస్తున్నాడని, ఆయన్ను నమ్మొద్దని సూచించారు. ఓటెందుకు వేయాలి సోమిరెడ్డి.. ఏం మేలు చేశావని ప్రజలు నీకు ఓటేయాలని సోమిరెడ్డిని మంత్రి ప్రశ్నించారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయి ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నాడన్నారు. రూ.కోట్లు వెచ్చించి ప్రతి గ్రామంలో మట్టిరోడ్డు లేకుండా చేశానని, మురుగునీరు బయటకు వెళ్లేందుకు డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించినట్లు కాకాణి చెప్పారు. పేదలకు భూముల పంపిణీ, చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపానన్నారు. మూడో పర్యాయం అవకాశం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో అందాయో గుర్తించి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట చిల్లకూరు వెంకురెడ్డి, పి.బాబిరెడ్డి, బూసుపల్లి చిన్నపరెడ్డి, కె.రామిరెడ్డి, శ్రీహరి, చంద్రశేఖర్, వై.పెంచలరెడ్డి, టి.నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
వలంటీర్లపై కక్ష కట్టిన చంద్రబాబు
● కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ‘చంద్రబాబు నాయుడు వలంటీర్లపై కక్ష కట్టాడు. వారు సంక్షేమ పథకాలు, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లు ఇవ్వకుండా తన మనుషుల ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని 200 మంది వలంటీర్లు బుధవారం తమ పోస్టులకు రాజీనామా చేశారు. అనంతరం నెల్లూరులోని ప్రసన్నకుమార్రెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రసన్నకుమార్రెడ్డి ప్రజల మనిషి అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం కోసం తమవంతు కృషి చేస్తామని వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రజా సేవ చేసే వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు టంగుటూరు మల్లికార్జునరెడ్డి, సచివాలయాల కన్వీనర్ మోర్ల మురళి, నాయకుడు కోడూరు మధుసూదన్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement