– నీళ్లు లేక ‘ఎక్స్రే’లు తీయని వైనం
– శిశువులకు స్నానం చేయించడానికీ ఇబ్బంది
– సమస్య తెలిసినా ట్యాంకులన్నీ ఖాళీగా ఉంచిన వైనం
– ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం
నీళ్లు లేకుంటే ఎక్స్రేలు తీయరా? ఇదేంటబ్బా.. ఇసిత్రం.. మేమెప్పుడూ ఇనలేదే.. అయినా సార్లు సెప్పినారు కదా.. రేపొద్దాం పదండి ! ఇదీ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగులు, వారి కుటుంబ సభ్యులకు తలెత్తిన సందేహాలు. అవును..ఇది నిజం. నీటి సరఫరా లేకపోవడంతో పీడియాట్రిక్, సర్జికల్, గైనిక్ వార్డుల్లోని రోగులతో పాటు ఎక్స్రేలు తీయించుకునేందుకు వచ్చిన వారూ ఇబ్బందిపడ్డారు.
- అనంతపురం మెడికల్
సర్వజనాస్పత్రిలో గైనిక్ వార్డు భవనంపైన ఉన్న నీటి ట్యాంక్ నుంచి సదరు వార్డుతో పాటు ఎక్స్రేలు తీసే మూడు గదులకు నీరు సరఫరా అవుతుంది. మంగళవారం ఉదయం ట్యాంక్లో నీళ్లు లేకపోవడంతో ఎక్స్రేలు తీసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రత్యేకంగా డ్రమ్ములను ‘డార్క్ రూం’లలో ఏర్పాటు చేసుకున్నా అందరికీ ఎక్స్రేలు తీయలేకపోయారు. ఎంఎల్సీ, ఆరోగ్య శ్రీ కింద వచ్చిన రోగులకు మాత్రమే ఎక్స్రేలు తీశారు. ఔట్పేషెంట్స్గా వచ్చిన ఏ ఒక్కరికీ తీయలేదు.
ముందే తెలిసినా.. పట్టించుకోలేదా?
అనంతపురానికి పీఏబీఆర్ నుంచి సరఫరా అవుతున్న నీటి పైప్లైన్ల లీకేజీల మరమ్మతుల కారణంగా సోమ, మంగళవారాల్లో నీటి సరఫరా ఉండదని గత శుక్రవారమే అధికారులు ప్రకటించారు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం ముందుచూపుతో వ్యవహరించి సంప్తో పాటు అన్ని వార్డుల వద్ద ఉన్న ట్యాంక్లను నీటితో నింపలేకపోయారు. ఫలితంగా రోగులకు నీటి కష్టాలు తప్పలేదు. గైనిక్ వార్డులో ఉన్న 50 మందికి పైగా శిశువులకు మంగళవారం స్నానం చేయించేందుకు నానా తిప్పలు పడ్డారు. బాత్రూంలకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. నీరు కోసం బయట సులభ్ కాంప్లెక్స్ను ఆశ్రయించారు.
స్పందించని ఎమ్మెల్యే
ఆస్పత్రిలో నీటి కష్టాలపై సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఉదయాన్నే ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. నగర పాలక సంస్థ కమిషనర్తో మాట్లాడారు. అత్యవసరంగా పది ట్యాంకర్లు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరారు. ఇందుకు సరేనన్న అధికారులు కేవలం రెండు ట్యాంకర్లు మాత్రమే పంపారు. ఆ నీటిని సంప్లో నింపారు. వాస్తవానికి సంప్ నుంచి ట్యాంకులకు నీటిని పంపింగ్ చేయాలంటే కనీసం ఐదు ట్యాంకర్లు అవసరం. కానీ రెండే రావడంతో ఆ నీరు ఎందుకూ పనికి రాకుండాపోయింది. మిగిలిన ట్యాంకర్ల కోసం అధికారులకు ఫోన్లు చేసినా ‘అదిగో..ఇదిగో’ అంటూ రోజంతా గడిపేశారు. బుధవారం నీరు అందుబాటులోకి రాకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.
"సర్వజన" కష్టాలు
Published Tue, Jul 4 2017 11:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement