టీవీ ఆన్ చేస్తుండగా షాక్‌... మహిళ మృతి | Sakshi
Sakshi News home page

టీవీ ఆన్ చేస్తుండగా షాక్‌... మహిళ మృతి

Published Tue, Feb 28 2017 9:35 AM

woman dies from electric shock in vanaparti district

కొత్తకొట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బూత్‌కూరులో విషాదం చోటుచేసుకుంది. టీవీ ఆన్ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి గృహిణి మృతిచెందింది.

వివరాలు.. సాయన్న, ఈశ్వరమ్మ (32) దంపతులు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో టీవీ ఆన్‌ చేసేందుకు ప్లగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు.
 

Advertisement
Advertisement