– మరణించిందని తెలిసినా కన్నెత్తి చూడని బంధువులు
– ఆమె వద్ద ఉన్న బ్యాగులో బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలియగానే రాబందుల్లా వాలిపోయిన వైనం
ఆమె బతికి ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఆమెను ఆదరించలేదు. అనారోగ్యంతో అవస్థలు పడుతున్నా అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఆమె మరణించిందని తెలిసినా చివరి చూపు కోసం కూడా రాలేదు. ఆమె దగ్గరున్న సంచిలో బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలియగానే ఆమె బంధువులం మేమంటే మేమంటూ రాబందుల్లా వాలిపోయారు.
కడప అర్బన్: చింతకొమ్మదిన్నెకు చెందిన చింతల మల్లీశ్వరి భర్త, కుమారుడు మృతి చెందడంతో గత కొంత కాలంగా రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయపురం వికలాంగుల కాలనీలో నివసిస్తోంది. ఆమె ఆలనాపాలనా చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో ఓ మహిళను పనిమనిషిగా పెట్టుకుని జీవించేది. ఈనెల 17న ఉదయం 11 గంటల ప్రాంతంలో రక్తహీనతతో బాధపడుతూ ఉంటే అదే ప్రాంతానికి చెందిన పని మనిషి సోదరుడు సుధీర్ అనే ఆటో డ్రైవర్ ఆమెను తీసుకుని వచ్చి రిమ్స్లోని మెడికల్ ఐసీయూలో చేర్పించాడు. ఈనెల 18 వ తేదీన మంగళవారం తెల్లవారు జామున ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందింది. ఆమె కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ మృత దేహంగా భావించారు. ఈ నేపథ్యంలో ఆమె తన దగ్గర ఉంచుకున్న హ్యాండ్ బ్యాగ్ను పరిశీలించారు. అందులో సుమారు 17 తులాల బరువు గల 12 బంగారు గాజులు, ఒక చైన్, ఉంగరాలు, వెండి పట్టీలు ఉన్నాయి. అలాగే ఆమె బ్యాంకు ఖాతాలో రూ.4 లక్షల నగదు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి వారు కొందరు ఆమె బంధువులం తామేనంటూ ముందుకు వచ్చారు. ఆమె కోసం వచ్చిన వారి దగ్గర నుంచి రిమ్స్ ఔట్పోస్టు పోలీసులు వివరాలను సేకరించారు. వారిలో ఆమెను రిమ్స్లో చేర్పించిన సుధీర్ అనే ఆటో డ్రైవర్, చింతకొమ్మదిన్నెకు చెందిన మల్లయ్య, పెద్దపోతులూరయ్య, రామాంజులు, గంగులయ్య, యల్లమ్మలు తాము బంధువులమంటే తామ బంధువులమంటూ ఎగబడ్డారు. దీంతో రిమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు సంబంధించిన వస్తువులను రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట శివకు అప్పగించారు. ఆయన రిమ్స్ సీఐకి ఫిర్యాదు చేసి వాటిని అప్పగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రిమ్స్ సీఐ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ తమ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
రిమ్స్లో మృతి చెందిన మహిళ
Published Wed, Oct 19 2016 12:01 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement