బావిలో పడి మహిళ మృతి | Sakshi
Sakshi News home page

బావిలో పడి మహిళ మృతి

Published Tue, Oct 18 2016 12:11 AM

Women died in Well

రామాపురం: రామాపురం మండలంలోని కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ సూర్యనారాయణపురానికి చెందిన సి.లక్షుమ్మ(65) అనే మతిస్థిమితం లేని మహిళ సోమవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి  చెందినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంత కాలంగా మతిస్థిమితం లేని లక్షుమ్మ అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండేది. ఆదివారం లక్షుమ్మ కనిపించకపోవడంతో గ్రామ పరిసరాల్లో వెతికారు. సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన వేంపల్లె గంగయ్య బావిలో మృతదేహమై పడి ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement