కర్నూలు: కర్నూలు శివారులోని పుల్లయ్య ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో స్త్రీ సాధికార చట్టాలపై మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంఏ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఎస్పీ ఆకే రవికృష్ణ, జూనియర్ సివిల్ జడ్జి గంగాభవాని, సీనియర్ న్యాయవాది వి.నాగలక్ష్మి తదితరులు పాల్గొని కుటుంబ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించటం –2005, వివాహిత మహిళలపై హింస, హిందూ వివాహ చట్టం–1955, విడాకులు తదితర అంశాలతో పాటు ఉచిత న్యాయం గురించి వివరించారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు నడుచుకోవాల్సిన పద్ధతులు, నిర్భయ చట్టం గురించి అవగాహన కల్పించారు.
Related news
-
స్కూటర్లో వెళ్తూ జూమ్ మీటింగ్ !
యశవంతపుర: ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరంలో ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈనెల 23న ఓ మహిళ తన కార్యాలయం వెళ్లేందుకు స్కూటర్లో బయలుదేరారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీంతో రోడ్డు పక్కన వాహనం నిలిపి సంస్థ నిర్వహించిన జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సదరు మహిళను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. -
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
ఆస్ట్రియన్ పర్యాటకురాలికి కేరళ పోలీసుల సమన్లు
కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది. పాలస్తీనా అనుకూల పోస్టర్ను చింపివేసూ ఒక ఆస్ట్రియన్ యూదు పర్యాటకురాలు కేరళలో స్థానికులతో వాదిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వారం ప్రారంభంలో ఎర్నాకులం జిల్లా ఫోర్ట్ కొచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో పోస్టర్ను చింపివేస్తున్న ఆమెను వారించేందుకు స్థానిక యువకులు ప్రయత్నించగా, ఆమె వారితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఆ పోస్టర్ చినిగిన ముక్కలను తీయమని అక్కడున్న యువకులు ఆమెకు చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ గోడపత్రికతో సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని వారు ఆమెకు సూచించడాన్ని కూడా ఆ వీడియోలో గమనించవచ్చు. An Austrian tourist tears down pro-palestinian posters in Kochi, India. What an entitled Zionist woman. Kerala Police filed a FIR against her. pic.twitter.com/X4CM7tIJCM — Mahesh Kusumagiri (@maheshkusumagir) April 17, 2024 ఈ వీడియో వైరల్గా మారిన నేపధ్యంలో కేరళ పోలీసులు విచారణ కోసం ఆ మహిళను పోలీస్ స్టేషన్కు రావాలని కోరారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ)కొచ్చి ఏరియా సెక్రటరీ మహమ్మద్ అజీమ్ కెఎస్ ఆ మహిళపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. ఎస్ఐవో అతికించిన పోస్టర్లను ఆ ఆస్ట్రియన్ యువతి చించివేసింది. కాగా గత జనవరిలో కోజికోడ్ బీచ్ సమీపంలోని స్టార్బక్స్ స్టోర్పై పాలస్తీనా అనుకూల పోస్టర్లు అతికించిన ఆరుగురు విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నాడు నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం స్టార్బక్స్ స్టోర్ గ్లాస్ డోర్పై ఆ విద్యార్థులు ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసిన పోస్టర్లను అతికించారు. గాజాలో జరిగిన యుద్ధ నేపధ్యంలో స్టార్బక్స్ ఇజ్రాయెల్కు అనుకూల వైఖరిని ప్రదర్శించినదుకు విమర్శలకు గురైంది. -
కార్పొరేట్ జాబ్ వదిలేసి మరీ..సివిల్స్ ర్యాంక్ కొట్టిన యువతి స్టోరీ
సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టేసింది. పట్టుదలతో చదివి ఊహించని ఫలితాన్ని సాధించింది. తాజా యూపీఎస్సీ ఫలితాల్లో టాప్-20లో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువతి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి..! ప్రతిష్టాత్మక పరీక్ష సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే అంత ఈజీకాదు. దీనికి ఎంతో పట్టుదల కృషి కావాలి. అలా దీక్షగా చదివి తన ప్రత్యేకతను చాటుకుంది నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్లో నివసించే వార్దా ఖాన్. మంగళవారం ప్రకటించిన తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించింది. తన తొలి ప్రిఫరెన్స్గా ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అని తెలిపింది. ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. సివిల్స్లో మంచి తన టార్గెట్. కానీ టాప్ 20లో ఉంటానని అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది వార్దా ఖాన్. దీంతో తన ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. వాస్తవానికి సివిల్స్కోసం 2021 నుండి సిద్ధమవుతున్నాననీ, రెండో ప్రయత్నంలో విజయం సాధించానని వెల్లడించింది. ఈ సందర్బంగా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Uttar Pradesh | Noida resident Wardah Khan secures 18th rank in UPSC 2023. She says, "I had never thought that I would make it to Top 20. I just wanted to make it to the list (of qualifiers). This is a huge moment for my family and me. This was my second attempt. I have… pic.twitter.com/2KoPdlDPmV — ANI (@ANI) April 16, 2024 నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్లో ఉండే వార్ధా ఖాన్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోగా ప్రస్తుతం తల్లితో కలసి ఉంటోంది. ఢిల్లీలోని ఖల్సా కాలేజీ నుంచి బీకామ్ హానర్స్ పూర్తి చేసింది. చదువు తరువాత ఎనిమిది నెలల పాటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసింది. అది సంతృప్తి నివ్వలేదు. పైగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం. దీంతో కష్టపడి చదవి తమ కలను సాకారం చేసుకుంది. హిస్టరీ, జియోపాలిటిక్స్ సబ్జెక్టులు అంటే ఇష్టమని పేర్కొంది. అలాగే కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో, MUN లలో (మాక్ యునైటెడ్ నేషన్స్) పాల్గొనేదాన్ని ఆ సమయంలో సివిల్స్ సాధించాలనే ఆలోచన తనలో కలిగిందని చెప్పుకొచ్చింది. -
ఆ రాష్ట్రంలో.. 1952 తర్వాత 1998లోనే మహిళా ఎంపీ!
ఉత్తరాఖండ్లో ఇంతవరకూ జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉత్తరాఖండ్ పేరుగాంచింది. అయితే రాజకీయాల్లో ఇక్కడ నేటికీ లింగవివక్ష కనిపిస్తూనే ఉంది. 1952లో రాష్ట్రంలోని తెహ్రీ నుంచి ఎన్నికైన కమలేందు మతి షా ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ. 1998లో నైనిటాల్ నుంచి ఎన్నికైన రెండో మహిళా ఎంపీ ఇలా పంత్. ఈ విధంగా చూస్తే రాష్ట్రం నుంచి లోక్సభకు మహిళా ఎంపీ చేరేందుకు 46 ఏళ్లు పట్టింది. 2012లో మాలా రాజ్య లక్ష్మి షా అనే మరో మహిళ ఎంపీ స్థాయికి చేరుకోగలిగారు. ఏడు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్సభలో ప్రాతినిధ్యం దక్కింది. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెహ్రీ నుంచి మాలా రాజ్యలక్ష్మి షా ఎంపీ అయ్యారు. 1952 ఎన్నికల్లో తెహ్రీ గర్వాల్ సీటు నుంచి రాజమాత కమలేందు మతి షా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నాటి రోజుల్లో కాంగ్రెస్కు భారీ మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడి ఎన్నికల్లో కమలేందు మతి షా విజయం సాధించారు. నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ కృష్ణ సింగ్ ఓటమి చవిచూశారు.
Related News by category
-
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్డేను వేదికగా చేసుకున్నారు. బర్త్డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు -
నేడు తర్తూరు రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: త ర్తూరు శ్రీ లక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓఏడీ వెంకటరమణ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంతో అలంకరించిన ప్రభోత్సవ రథంపై కొలువుంచారు. అనంతరం గ్రామోత్సవంలో ప్రజలు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
ఓటు తప్పకుండా వేస్తా
నేను బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. దరఖాస్తును ఆమోదించి ఓటరుగా నమోదు చేశారు. స్మార్ట్ ఎపిక్ కార్డు కూడా వచ్చింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు ఓటు లభించింది. పోలింగ్ రోజు ఎన్ని పనులున్నా.. ఓటు తప్పకుండా వేస్తాను. స్వేచ్ఛగా, నిర్ఛయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాను. – పి.లక్ష్మిచేతన రెడ్డి, వీనస్ కాలనీ, కర్నూలు ● -
స్నేహితులతో కూడా ఓటు వేయిస్తా
ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడంతోనే అమోదించి ఓటరుగా నమోదు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో నా ఓటు నేను స్వేచ్ఛగా వినియోగించుకుంటాను. పాలకులు మంచివారైతే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటువేస్తాను. మొదటి సారిగా ఓటు వేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఓటు వేస్తా... నా స్నేహితులతో కూడా ఓటు వేయిస్తాను. – గుర్రం చేతన లాస్య, చాణుక్యపురి కాలనీ, కర్నూలు -
మంచి పాలనకే ‘తొలి’ ఓటు!
● నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాం ● ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగం ● పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది ● తొలిసారిగా ఓటు వేయబోతున్న యువత మనోగతం కర్నూలు(అగ్రికల్చర్): మంచి పాలన అందించే వారికే తాము ఓటు వేస్తామని తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు చెబుతున్నారు. పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి వారినే తాము ఎన్నుకుంటామని పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో 20.14 లక్షలు, నంద్యాల జిల్లాలో 13.94 లక్షలు.. మొత్తం 34.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18, 19 ఏళ్ల యువత 1,71,215 మంది ఉన్నారు. అయితే ఇందులో 87,285 మంది ఓటర్లుగా నమోదయ్యారు. మే నెల 13న నిర్వహించే శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 49,741, నంద్యాల జిల్లాలో 37,844 మంది మొద టి సారిగా ఓటు వేయనున్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వీరు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే వారిని, అభివృద్ధి చేసేవారని గెలిపిస్తామని చెబుతున్నారు. ఈ సారి పెరగనున్న ఓటింగ్ శాతం.. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఎన్నికల కమిషన్ పిలుపు నిస్తోంది. ఇందులో భాగంగా స్వీప్ కార్యక్రమాలను అధికారులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. 2019 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఓటింగ్కు 50 శాతం వరకు యువత దూరంగా ఉంటోంది. ఈ సారి ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా యువఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. నియోజక వర్గం 18–19 ఏళ్ల యువ ఓటర్లు కర్నూలు 6,425 పాణ్యం 8,250 పత్తికొండ 5,678 కోడుమూరు 5,947 ఎమ్మిగనూరు 6,483 మంత్రాలయం 5,429 ఆలూరు 5,749 శ్రీశైలం 8,349 నంద్యాల 6,709 బనగానపల్లె 6,402 ఆదోని 5,510 ఆళ్లగడ్డ 5,247 డోన్ 5,488 నందికొట్కూరు 5,609 మొత్తం 87,275
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement