మిరప పంటలను పరిశీలించిన వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

మిరప పంటలను పరిశీలించిన వైఎస్‌ జగన్‌

Published Sun, Jan 8 2017 1:25 PM

ys jagan mohan reddy visit capsicum fields in kurnool district

కర్నూలు: కర్నూలు జిల్లాలో రైతు భరోసాయాత్ర చేస్తున్న జననేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సంతజూటూరులో తెగుళ్ల కారణంగా నష్టపోయిన మిరప పంటలను పరిశీలించారు. రైతులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రుణమాఫీ, ఇన్‌ పుట్‌ సబ్సిడీ గురించి ఆరా తీశారు.

ఇప్పటివరకు రుణమాఫీ చేసిన డబ్బులు వడ్డీకే సరిపోయాయని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్య పడొద్దని రైతులకు జగన్‌ భోసాయిచ్చారు. అన్నదాల సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement