Sakshi News home page

ఒకేరోజు ఆరున్నర కోట్ల స్వాధీనం!!

Published Wed, Mar 19 2014 4:23 PM

ఒకేరోజు ఆరున్నర కోట్ల స్వాధీనం!!

లెక్కచెప్పకుండా తీసుకెళ్తున్న ఆరున్నర కోట్ల రూపాయల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పంచిపెట్టడానికే ఈ సొమ్ము తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో నాలుగు వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శివహరి మీనా తెలిపారు. మొదట్లో నాలుగు కోట్లే అని భావించినా, తర్వాత వ్యాను వెనుక భాగంలో మరో రెండు కోట్ల రూపాయలు కనిపించాయి.

వ్యాన్ డ్రైవర్ ఈ మొత్తం గురించి ఏమీ చెప్పకపోవడంతో ఆదాయపన్ను శాఖ అధికారులకు ఆ మొత్తాన్ని అప్పగించారు. మరో రెండు వాహనాల నుంచి 26 లక్షలు, 6 లక్షలు పట్టుకున్నారు. 24వ నెంబరు జాతీయ రహదారి మీద మరో వాహనం నుంచి రూ. 4.12 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement