సెల్యూట్ వద్దు.. ఓటేయండి చాలు | Sakshi
Sakshi News home page

సెల్యూట్ వద్దు.. ఓటేయండి చాలు

Published Mon, Mar 17 2014 3:05 PM

సెల్యూట్ వద్దు.. ఓటేయండి చాలు - Sakshi

ఒకప్పుడు ఆయన పోలీసు స్టేషన్లోఅడుగుపెట్టారంటే చాలు.. పోలీసులంతా ఒకేసారి లేచి నిలబడి సెల్యూట్ కొట్టేవారు. కానీ, ఇప్పుడు మాత్రం తనకు సెల్యూట్లు వద్దని, ఓట్లు వేస్తే చాలని ఆయన అంటున్నారు. ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అజిత్ జోయ్ (44) నిన్న మొన్నటి వరకు ఐపీఎస్ అధికారి. ఇప్పుడు తిరువనంతపురం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడ్డారు. ఇంతకుముందు ఎప్పుడూ సందడిగా ఉండే మ్యూజియం పోలీసు స్టేషన్లో ఫుల్ యూనిఫాంలో కనపడే ఆయన, ఉన్నట్టుండి ఆమ్ ఆద్మీ పార్టీ టోపీ పెట్టుకుని కనిపించడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ప్రచారంలో భాగంగానే తాను పోలీసు స్టేషన్కు కూడా వచ్చి, ఇంతకుముందు తనతో కలిసి పనిచేసిన అధికారులను ఓట్లు అడిగినట్లు జోయ్ చెప్పారు. వారిని వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అడిగానన్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన జోయ్.. బీహార్ కేడర్ అధికారి. అంతకుముందు కేరళలో పనిచేశారు. తిరువనంతపురంలో ఆయన ప్రత్యర్థులు.. కేంద్ర మంత్రి శశిథరూర్, సీపీఐ అభ్యర్థి బెన్నెట్ అబ్రహం ఇద్దరూ ఉద్దండులే. గత సంవత్సరమే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన, ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు.

Advertisement
Advertisement