'అవే ఫలితాలు పునరావృతమవుతాయి' | Sakshi
Sakshi News home page

'అవే ఫలితాలు పునరావృతమవుతాయి'

Published Thu, May 15 2014 4:04 PM

'అవే ఫలితాలు పునరావృతమవుతాయి' - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ అన్నారు. గతంలో గుజరాత్‌లో బీజేపీ అన్ని జిల్లా పరిషత్‌ స్థానాల్లో ఓడిపోయిన రెండు నెలల తర్వాత నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తు చేశారు. అవే ఫలితాలు ఇక్కడ కూడా పునరావృతమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు.

Advertisement
Advertisement