సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారయాత్ర ‘వైఎస్సార్ జనభేరి’ సోమవారం రాత్రి జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాకు వచ్చిన జననేతకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకుని జగన్ సరిగ్గా రాత్రి 8.15 గంటలకు గుంటూరు జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించారు. గుంటూరు నుంచి కొలకలూరు, నందివెలుగు మీదుగా కాన్వాయ్ మండల కేంద్రం కొల్లిపరకు చేరుకుంది. జగన్ ప్రచార రథంలోనే కూర్చుని రహదారులపై తనకోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేస్తూ నేరుగా కొల్లిపర బస కేంద్రానికి చేరుకున్నారు. మార్గమధ్యలో ప్రతి గ్రామంలో ప్రధాన రహదారుల వెంట జనం జగన్ను చూసేందుకు బారులుతీరారు. జగన్ తమ గ్రామంలో నుంచి వెళతారని తెలుసుకుని ఎప్పుడు వస్తారా అని ప్రజలు ఎదురుచూపులు చూశారు. గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్లు ఎదురేగి స్వాగతం పలికారు. కొల్లిపరలోని గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు గుదిబండి చినవెంకటరెడ్డి నివాసంలో రాత్రి బస చేశారు.
జననేతకు ఘన స్వాగతం
Published Tue, Apr 22 2014 12:35 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement