'సీమాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తాం' | Sakshi
Sakshi News home page

'సీమాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తాం'

Published Wed, May 7 2014 10:11 AM

'సీమాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తాం' - Sakshi

పులివెందుల : సీమాంధ్రలో క్లీస్‌ స్వీప్‌ చేస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో మద్దతుపై తొందరపడబోమన్నారు. రాష్ట్ర విభజన చాలా అన్యాయంగా జరిగిందని జగన్ అభిప్రాయపడ్డారు. తాను తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని ఆయన తెలిపారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

కాగా పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి... స్వగ్రామం పులివెందులలోని భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  124వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 7 గంటల 35 నిమిషాల ప్రాంతంలో ఆయన
ఓటు వేశారు.
 

Advertisement
Advertisement