- కిన్నెర, ఇ-మెయిల్
ముఖం మీద జిడ్డు చేరినప్పుడు వెంటనే తొలగించకపోతే దుమ్ము, ధూళి కణాలు చేరి మొటిమలకు కారణాలు అవుతాయి. జిడ్డు చర్మం గలవారికి వచ్చే ప్రధాన సమస్య మొటిమలు. అందుకని ఎప్పటిక ప్పుడు ముఖం మీద అదనంగా చేరే జిడ్డును తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్గానిక్ ఫేస్ స్క్రబ్ని ముఖానికి రాసుకొని, సున్నితంగా రబ్ చేసి, వెచ్చని నీటితో కడగాలి. రోజులో మూడు, నాలుగు సార్లు ఫేస్వాష్తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే త్వరగా జిడ్డు పట్టే సమస్య తగ్గి, రోజంతా తాజాగా ఉంటుంది.
ముఖచర్మం నిస్తేజంగా ఉంటోంది!
- రాగిణి, సీతాఫల్మండి, హైదరాబాద్
బయట తిరిగే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం త్వరగా డల్గా మారుతోంది. రోజూ సాయంకాలం ఇంటికి వెళ్లిన తర్వాత స్వచ్ఛమైన రోజ్వాటర్లో దూదిని ముంచి ముఖమంతా తుడుచుకోవాలి. అదే విధంగా ఉదయం కూడా చేయాలి. తర్వాత మంచి నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు బంగాళదుంపను తురిమి ముఖానికి పట్టించి, సున్నితంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజులో ఏర్పడే జిడ్డును తొలగించుకోవడానికి పదే పదే నీటితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. వెట్ వైట్ టిష్యూ పేపర్తో చెమటను అద్దాలి. అంతే తప్ప గట్టిగా రుద్దకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ట్యాన్ తగ్గుతుంది. ముఖం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.
జిడ్డు తగ్గాలంటే ఏం చేయాలి?
Published Wed, Apr 2 2014 11:43 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement