మహిళారైతు భూదేవి-6
పురుగుల మందు డబ్బాలు రైతు చేతులో కనిపిస్తే చాలు పంజాల విజయతో పాటు ఆమె కుటుంబ సభ్యులూ నిలువెల్లా వణకిపోతుంటారు. వారి కళ్లలో గత కాలపు విషాదం నీటి బిందువులుగా క్షణాల్లో సుడులు తిరుగుతుంది. కారణం.. కుటుంబంలో ముగ్గురు రైతులు రెండేళ్ల వ్యవధిలోనే పురుగులమందు తాగి బలవన్మరణం పాలయ్యారు. వ్యవసాయాన్నే జీవనాధారంగా బతికిన భర్త, తండ్రి, సోదరుడు అప్పులపాలై పురుగులమందు తాగి మరణించడంతో జీవితం అంధకారమయమైంది. అయినా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా పశువుల పెండను ఎరువుగా చేసి పంటలు తీస్తూ ఆదర్శ మహిళ రైతుగా నిలిచారు విజయ.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డివిజన్లోని మంగపేట గ్రామానికి చెందిన సన్నకారు రైతు మోత్కూరి రామస్వామి తన కూతురు విజయను దగ్గరలోని మల్యాలకు చెందిన రైతు పంజాల చంద్రమౌళికి ఇచ్చి పెళ్లి జరిపించారు. పత్తి తదితర పంటలు సాగు చేసి అప్పులపాలై భర్త పొలానికి వాడే పురుగులమందే తాగి బలవన్మరణం పాలవడంతో విజయ జీవితం కష్టాలపాలైంది. తన బిడ్డ, కొడుకును గుండెలకు హత్తుకొని పుట్టింటికి వచ్చింది. అదే ఏడాది తండ్రి రామస్వామి పురుగుల మందు తాగి ప్రాణం వదిలాడు. తండ్రి సంవత్సరీకం జరుపక ముందే విజయ సోదరుడు శ్రీనివాస్ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. అటువంటి చిమ్మచీకట్లు కమ్ముకున్న దశలో విజయ మనోబలంతో పొలంలోకి ముందడుగు వేసింది. చిన్న తమ్ముడిని వెంట వేసుకొని తండ్రి మిగిల్చిన ఎకరం భూమిలో మొక్కజొన్న పంట వేసింది. పురుగుమందులకు స్వస్తి చెప్పింది. ఇంట్లో ఉన్న బర్రె పెండకు తోడుగా ఊరిలోని పశువుల పెండను సేకరించి పంటకు ఎరువుగా వేస్తోంది.
మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ఐదేళ్లలో అప్పును వడ్డీతో సహా తీర్చింది. తమకున్న ఎకరంతో పాటు మరో ఎకరం కౌలుకు సాగు చేస్తున్న విజయ పుట్టెడు కష్టాలను సైతం రసాయనిక విషాల్లేని వ్యవసాయంతో జయిస్తోంది. కూతుర్ని, కుమారుడిని కొండంత ఆశతో చదివిసోం్తది.
పంపిన వారు: కట్టా నరేంద్రాచారి,
పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా విజయ
ఆదర్శ మహిళ రైతుగా ...
Published Sat, Feb 21 2015 11:03 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నందీశ్వరస్వామికి విశేషపూజలు
కేఎంసీలో పలువురు వైద్యుల బదిలీ
టీడీపీపై ప్రజల తిరుగుబాటు
నయవంచకుడు చంద్రబాబు
ప్రకృతి వ్యవసాయంతోనేల ఆరోగ్యం
బీసీ స్వగ్రామంలోనే టీడీపీకి షాక్
మాటిచ్చాడంటే.. చేస్తాడంతే
చంద్రబాబు కేరాఫ్ కరువు
కర్నూలు టీడీపీలో ‘పోల్ మేనేజ్మెంట్’ కేటుగాళ్లు!
మళ్లీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement