పశ్చిమ బెంగాల్లో వేగంగా మారుతున్న రాజ కీయ పరిణామాలు వివిధ రంగుల్ని సంతరించుకుంటున్నాయి. మమత రానున్న ఎన్నికల్లో మోదీ వ్యతిరేక కూటమి నాయకురాలిగా నిలిచే భావనలో ఉన్నారు కాబట్టి ప్రతీ విషయాన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశంగా మలిచే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం సీబీఐ నేపథ్యంగా సాగుతున్న పోరాటం సమంజసమైనది కాదు. ఎందుకంటే సీబీఐ తనిఖీ చెయ్యాలనుకొన్నది ఒక పెద్ద కుంభకోణంకి సంబంధించిన వ్యవహా రంలో. వేల కోట్ల రూపాయల మేరకు ప్రజలకు టోపీ పెట్టి తప్పించుకు తిరుగుతున్న పెద్ద తలకాయలపై 2013 నుంచీ ఉన్న కేసు ఇది.
శారదా కుంభకోణం కానీ, రోజ్ వ్యాలీ కుంభకోణం కానీ లక్షలాది పేదల సొమ్ము పోంజీ స్కీమ్ ద్వారా సేకరించి, మనీ లాండరింగు లాంటి తీవ్ర నేరాలతో ముడిపడిన స్కాం వ్యవహారం. ఈ కేసును రాష్ట్ర పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని గ్రహించి సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చెయ్యడానికి సిద్ధపడిన అధికారి గతంలో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసి ఉన్న రాష్ట్ర అధికారి. సీబీఐ గొప్పదేమీ కాకపోవచ్చు. కానీ ఈ వేలకోట్ల అవినీతి కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుని జరగనివ్వాలి. కేంద్రాన్ని బోనులో నిలబెట్టడానికి మంచి అవకాశంగా భావించి దర్యాప్తుని అడ్డుకొంటే అది ప్రజల పట్ల బాధ్యతారాహిత్యమే. పోరాడటానికి సవాలక్ష రాజకీయ ఆయుధాలున్నాయి. ఇది మాత్రం కాదు.
-డా డీవీజీ శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం
Published Wed, Feb 6 2019 1:22 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో రెండ్రోజులు వర్ష సూచన
యువత చేతుల్లోనే దేశ పాలన
సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ మంగళం
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి
కొను‘గోల్’.. జాప్యం
● సెగ్మెంట్లలో ఓట్లు తగ్గితే ఇబ్బందులే.. ● కొత్త, పాత నాయకుల్లో కుదరని సఖ్యత ● కేడర్లో వర్గపోరు, అంతర్గత కుమ్ములాట ● ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీ ఎన్నికలు
పోస్టల్ బ్యాలెట్ గడువు పొడగింపు
శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ క్యాంపు దోహదం
పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా
పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement