లాడెన్ వారసులంతా కాంగ్రెస్‌లోనే.. | Sakshi
Sakshi News home page

లాడెన్ వారసులంతా కాంగ్రెస్‌లోనే..

Published Fri, Feb 19 2016 12:53 PM

లాడెన్ వారసులంతా కాంగ్రెస్‌లోనే.. - Sakshi

హైదరాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ వారసులంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ శ్రీధర్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ..అంబర్‌పేటలో డిపాజిట్ కోల్పోయిన వి.హనుమంతరావుకు కిషన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు.
 
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవారిని సపోర్టు చేయడమే కాంగ్రెస్ దృష్టిలో.. రాహుల్ దృష్టిలో దేశభక్తా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని..లేదంటే బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement