హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం | Sakshi
Sakshi News home page

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

Published Thu, Dec 1 2016 7:04 AM

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

కులు: హిమాచల్ ప్రదేశ్ లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కులులో ఉదయం 4.12నిమిషాల ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూమి కంపించినట్లు వాతావరణ, భూభౌతిక సంస్ధ వెల్లడించింది. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. తక్కువ తీవ్రత వల్లే ఎలాంటి నష్టం సంభవించలేదని పేర్కొంది. కొద్ది రోజుల క్రితం నేపాల్ లో కూడా భూమి కంపించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement