పోలీసులు ముమ్మర తనిఖీలు ... 559 మంది అరెస్ట్ | Sakshi
Sakshi News home page

పోలీసులు ముమ్మర తనిఖీలు ... 559 మంది అరెస్ట్

Published Tue, Dec 16 2014 9:45 AM

పోలీసులు ముమ్మర తనిఖీలు ... 559 మంది అరెస్ట్ - Sakshi

హైదరాబాద్: నగరంలోని సెంట్రల్ జోన్ పరిధిలోని పార్క్ల్లో పోలీసులు మంగళవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 559 మందిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరంతా పార్క్ల్లో తిష్ట వేసి ... అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చైన్ స్నాచింగ్, ఇళ్లలో దొంగతనాలు తదితర నేరాలతో వీరికి ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

వీరందరిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు పలు చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి. సెంట్రల్ జోన్ పరిధిలో నేరాలు అధికమైన నేపథ్యంలో డీసీపీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 559 మందిలో అత్యధికులు యువకులేనని పోలీసులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement