-
తెలుగు యువతకు చెందిన 60 లక్షలు పట్టివేత..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ హైదరాబాద్లో గురువారం భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడింది. తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కారు డ్రైవర్ మహేశ్ వద్ద నుంచి పోలీసులు 60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలకు డబ్బులు తరలిస్తుండగా మహేశ్తోపాటు మరో ఐదుగురిని సెంట్రల్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ ఆదేశాలతోనే డబ్బు తరలిస్తున్నట్టు మహేశ్ పోలీసులకు తెలిపారు. భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జగిత్యాలకు ఎందుకు తరలిస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. -
దీపం ఉండగానే.. దోచుకో.. దాచుకో..
సెంట్రల్ జోన్ తీరూతెన్నూ ఇసుక నుంచి పేకాట వరకు అన్నింటా మామూళ్లే నిత్యం సెటిట్మెంట్లతో శివారు స్టేషన్ బిజీబిజీ కాసులకు కక్కుర్తిపడి కేసులు కట్టని మరో స్టేషన్ అధికారి విజయవాడ పోలీసు కమిషనరేట్లో అధిక ఆదాయ వనరులు ఉండే జోన్.. సెంట్రల్. కొత్తగా ఏర్పడినా.. ఏసీపీని నియమించినా ఇక్కడి స్టేషన్లు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది మాత్రం పూర్తిగా పాతవారే. దీంతో ఇక్కడ సెటిల్మెంట్లు, వ్యవహారాలు ఇష్టానుసారంగా సాగుతున్నాయి. భూగర్భ సంపద దోపిడీ మొదలుకొని రియల్ ఎస్టేట్ దందాలు, వ్యభిచార ముఠాల వరకు అన్నీ ఇక్కడ నిత్యకృత్యం. విజయవాడ : పోలీసు కమిషనరేట్లోని సెంట్రల్ జోన్లో ఒక్కొక్క అధికారిది ఒక్కో తీరు. కేసులను డీల్ చేసే విధానంలోనే తేడా ఉంటుంది తప్ప ధనార్జన, రాజకీయ సిఫార్సుల విషయంలో మాత్రం దాదాపు అందరూ ఒక్కటే! రాష్ట్రంలోనే సంచలనంగా మారి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాల్మనీ-సెక్స్రాకెట్ వ్యవహారానికి సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నమోదయ్యాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ధోరణిలో కొందరు అధికారులు ఉండటం గమనార్హం. శివారు స్టేషన్లో దందాలు షురూ... నగర శివారులో ఉన్న పోలీస్స్టేషన్ నిత్యం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే సదరు స్టేషన్ సీఐ పనితీరు బాగోలేదని, అవినీతి ఆరోపణలు ఉన్నాయనే కారణంగా ఏలూరు రేంజ్కు సరెండర్ చేశారు. అయినా అధికార పార్టీ ఆధిపత్యంతో ఈ వ్యవహారాలు నిత్యకృత్యంగానే సాగుతున్నాయి. ముఖ్యంగా తాడిగడప, వణుకూరు, చౌడవరం గ్రామాల్లోని అపార్ట్మెంట్లు, తోటలు, నది ఒడ్డున అధికార పార్టీ నేతలు లక్షల్లో నిర్వహించే పేకాట శిబిరాలు కొనసాగుతూనే ఉన్నాయి. రియల్ దందాలపై ఫిర్యాదులు అనేకం వస్తున్నా కేసుల దాకా రానీయని పరిస్థితి. కొన్నింటిని పోలీసులు, మరికొన్ని సందర్భాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు సెటిల్మెంట్లు చేస్తుంటారు. ఇక ఇసుక దందాకు అడ్డే లేదు. ప్రజాప్రతినిధి అనుచరులు రోజుకు రూ.5 లక్షలు విలువ చేసే ఇసుకను నాలుగు నెలల పాటు తవ్వారు. నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ఆరు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వినా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. ఇక స్టేషన్ పరిధిలోని బార్లు, వైన్ షాపుల నుంచి నెలవారీలు షరా మామూలే. ఒక్కొక్క బార్ నుంచి రూ.18 వేలు, వైన్ షాపు నుంచి రూ.16 వేలు వసూలు చేస్తారు. పంచాయితీలతో బిజీబిజీ... ఆటోనగర్ పంచాయితీలతో మరో స్టేషన్ బిజీబిజీగా ఉంటుంది. కేసులు అతి తక్కువగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నిత్యం పాత ఇనుప మాయం, దొంగ రవాణా, వ్యాపారుల మధ్య వివాదాలు ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉన్నా కేసుల దాకా రానివ్వకుండా ప్రత్యేక ధరలతో సెటిల్మెంట్లు చేయటం మామూలే. శివారు ప్రాంతంలో అనేక సంపన్న కాలనీలు ఈ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ వ్యభిచార ముఠాల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నా స్టేషన్ వరకు తెలియదు. ఎక్కువ సమయం బిజీగా ఉంటూ స్టేషన్లో తక్కువ ఉంటూ బయటే పంచాయితీలు సాగిస్తుంటారని ఇక్కడి ఒక అధికారిపై ఆరోపణలున్నాయి. ఇక స్టేషన్ పరిధిలో బార్లు ఎక్కువగా ఉండటంతో కలెక్షన్కు లోటుండదు. ఇటీవల ప్రసాదంపాడుకు చెందిన ఒక యువతి ప్రేమ పేరుతో మోసపోయిన ఫిర్యాదులో భారీగా దండుకున్నారనే ఆరోపణలున్నాయి. కీలక ఘటనల్లో అధికార పార్టీ కలరింగ్ ప్రత్యేకత. రెండు నెలల క్రితం ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో స్కూల్ ప్రిన్సిపాల్పై మృతిచెందిన బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ నుంచి భారీ మొత్తం తీసుకొని కేసులో పేరు లేకుండా చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఆధిపత్యం జోన్ పరిధిలోని మూడు స్టేషన్లలో అధికార పార్టీ నేతల అధిపత్యం అధికం. నగరంలోని ఒక ప్రజాప్రతినిధి ప్రత్యేకంగా తన నియోజకవర్గంలో స్టేషన్లకు వచ్చే పంచాయితీలు, అనుకూల ఫిర్యాదుల పష్కారం కోసం ఒక చోటా నేతకు బాధ్యతలు అప్పగిం చారు. ఆ నేత నిత్యం స్టేషన్ల వద్దే ఉంటూ ప్రతి ఫిర్యాదునూ అధికారుల సహకారంతో సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. శివారు ప్రాం తంలో ఉండే స్టేషన్లో సదరు అధికార ప్రజాప్రతినిధి హవాకు అడ్డే లేదు. కాల్మనీ నిందితుల్ని రక్షించటం మొదలుకొని పేకాట శిబిరాల వరకు అన్నీ ఇక్కడే ఉన్నా పోలీసులకు కనిపించదు. -
పోలీసులు ముమ్మర తనిఖీలు ... 559 మంది అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని సెంట్రల్ జోన్ పరిధిలోని పార్క్ల్లో పోలీసులు మంగళవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 559 మందిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరంతా పార్క్ల్లో తిష్ట వేసి ... అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చైన్ స్నాచింగ్, ఇళ్లలో దొంగతనాలు తదితర నేరాలతో వీరికి ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వీరందరిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు పలు చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి. సెంట్రల్ జోన్ పరిధిలో నేరాలు అధికమైన నేపథ్యంలో డీసీపీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 559 మందిలో అత్యధికులు యువకులేనని పోలీసులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement