మాజీ ఎంపీపై పీఎస్ లో మహిళ ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీపై పీఎస్ లో మహిళ ఫిర్యాదు

Published Sat, Jul 11 2015 2:20 PM

A case filed against EX MP tulasiram

హైదరాబాద్ : తన భర్తను కిడ్నాప్ చేశారంటూ మాజీ ఎంపీ తులసీరామ్ పై ఓ మహిళ ఫిర్యాదుచేసింది. తన భర్తపై దాడి చేసి తులసీరామ్ బలవంతంగా తీసుకెళ్లారంటూ మైలార్దేవ్పల్లి పోలీసులను శనివారం ఓ మహిళ ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే పీఎస్లో కిడ్నాప్ అయినట్లు ఆరోపణలున్న వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. భూ వివాదంలో బెదిరింపులకు పాల్పడి తనతో మాజీ ఎంపీ చెక్కులు, బాండ్లపై సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement