ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అప్రమత్తం
♦ పోలీసు, జలమండలి, ఆరోగ్య, విద్యుత్ శాఖలతో సమన్వయం
♦ నీటి సమస్య తలెత్తకుండా ట్యాంకర్లతో ఒప్పందం
♦ భారీగా అందుబాటులో ఉంచుకున్న ఫోమ్ సిలిండర్లు
♦ హైదరాబాద్లో అందుబాటులో 20 మోటార్ సైకిళ్లు
సాక్షి, హైదరాబాద్: అగ్నిప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. సత్వరమే ఘటనాస్థలానికి వెళ్లే విషయంపై కసరత్తు చేస్తోంది. ప్రమాదం చోటు చేసుకున్న పదిహేను నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి ఫైరింజన్ వెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటోంది. దీనికి ఆటంకంగా ఉన్న ట్రాఫిక్, నీటి సమస్యలను అధిగమించేందుకు పోలీసు, జలమండలి శాఖలతో సమన్వయం చేసుకుంటోంది. నీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఘటనాస్థలానికి ఫైరింజన్ను నీటి ట్యాంకర్లు కూడా అనుసరించనున్నాయి.
హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ ఇంజన్ను జలమండలికి చెందిన ట్యాంకర్లు అనుసరించేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే ఇతర ముఖ్య పట్టణాలలో కూడా ప్రైవేటు ట్యాంకర్లలతో ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా పరిశ్రమలతోపాటు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వద్ద నీరు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అగ్నిమాపక శాఖ ఆదేశాలిచ్చింది. వేసవి ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజూ 70 నుంచి 80 వరకు అగ్నిప్రమాదాల ఫిర్యాదులు వస్తుండటంతో శాఖ డెరైక్టర్ జనరల్ రాజీవ్ రతన్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
నాలుగు శాఖలతో సమన్వయం..
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పరిస్థితిని అదుపు చేయడంతోపాటు నష్టనివారణ చర్యలు చేపట్టడం కోసం అగ్నిమాపకశాఖ నాలుగు విభాగాలతో సమన్వయం చేసుకుంది. పోలీసు, జలమండలి, ఆరోగ్యశాఖ, విద్యుత్శాఖలతో సమన్వయం చేసుకుంది. ఎక్కడైన ప్రమాదం జరిగిన వెంటనే నాలుగు విభాగాలకు ఒకేసారి సమాచారం అందేలా కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడం కోసం 108 అంబులెన్స్ కూడా వెంటనే ఘటనాస్థలానికి చేరుకోనుం ది. వాటర్ ట్యాంకర్ల అందజేయడం కోసం జలమండలి, విద్యుత్ సరఫరా విషయమై అంచనా వేయడానికి ఆ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగనున్నారు. ఇలా నాలుగు శాఖలను సమన్వయం చేయడం కోసం కంట్రోల్ రూమ్ వద్ద 24 గంటలపాటు అందుబాటులో ఉంచేలా వ్యవస్థను రూపొందించారు.
అందుబాటులోకి ఫైర్ మోటార్ సైకిళ్లు
చిన్న, చిన్న ప్రమాదాలు తలెత్తితే మహానగరాల్లో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకునేందుకు అగ్నిమాపకశాఖ మోటార్ సైకిళ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రమాదం తలెత్తితే వెంటనే ఫోమ్ సిలిండర్లు అమర్చిన మోటార్ సైకిళ్లు రంగంలోకి దిగనున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 20 మోటార్ సైకిళ్లను సిద్ధంగా ఉంచారు. వరంగల్, కరీంనగర్లలో కూడా ఈ వాహనాలను ఏర్పాటు చేశారు.
ఇక 15 నిమిషాల్లోనే ఫైరింజన్!
Published Tue, Apr 12 2016 5:46 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
What’s your opinion
Advertisement