- రోహిత్ సూసైడ్ నోట్ కూడా మా ముందుంచండి
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో నమోదైన కేసుకు సంబంధించి రోహిత్ సూసైడ్ నోట్తో పాటు రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టేయాలని కోరుతూ హెచ్సీయూ వైస్ చాన్స్లర్ అప్పారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని న్యాయ మూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ గురువారం మరోసారి విచారించారు. అప్పారావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు సుశీల్కుమార్పై దాడి జరిగే నాటికి అప్పారావు వీసీ కాదని, ఆయన ప్రొఫెసర్ మాత్రమేనన్నారు. కొంత మంది విద్యార్థులు సుశీల్ గదికి వెళ్లి దాడి చేసిన నేపథ్యంలో ఘటనను ప్రాక్టోరియల్ బోర్డు తీవ్రంగా పరిగణించి ఐదుగురు విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసేందుకు సిఫారసు చేసిందన్నారు. దీనికి వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా సిఫారసు చేసిందన్నారు.
ఇవన్నీ అప్పారావు వీసీగా నియమితులు కావడానికి ముందే జరిగాయని, వీసీగా నియమితులైన తర్వాతనే ప్రాక్టోరియల్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసులు అప్పారావు ముందుకు వచ్చాయని, వాటిని పరిశీలించిన ఆయన విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా ధృక్పథంతో వారి పట్ల మెతక వైఖరిని అవలబించారన్నారు. రోహిత్ సూసైడ్ నోట్లో అప్పారావు గురించి ఎటువంటి ప్రస్తావన లేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ సూసైడ్ నోట్ లేకుండా అందులోని కొంత భాగాన్ని మాత్రమే ఎలా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రోహిత్ సూసైడ్ నోట్తో పాటు ఈ కేసు పూర్తి రికార్డులను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 17కు వాయిదా వేశారు.
రికార్డులన్నింటినీ సమర్పించండి
Published Fri, Feb 12 2016 2:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
Advertisement