ఖరీఫ్ ముగుస్తున్నా రుణాలివ్వని బ్యాంకులు
81 శాతం పంటలు సాగైతే... 51 శాతానికే రుణాలు
రూ. 23,851 కోట్లకు ఇచ్చింది రూ. 12,318 కోట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు బ్యాంకులతో తిప్పలు తప్పడం లేదు. ఖరీఫ్ పంటల సాగు ముగింపు దశకు చేరుకున్నా కూడా పంట రుణాలు అందడం లేదు. ఇప్ప టివరకు ఖరీఫ్ సాగు 81 శాతం పూర్తయినా.. రుణాల మంజూరు మాత్రం లక్ష్యంలో సగానికే పరిమితం కావడం గమనార్హం. 2017–18 ఖరీఫ్ సీజన్ పంట రుణాల లక్ష్యం రూ. 23,851 కోట్లుకాగా.. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.12,318 కోట్లే. బ్యాం కులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఖరీఫ్లో 29.63 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు. కానీ బ్యాంకులు 18.38 లక్షల మందికి మాత్రమే రుణాలు ఇచ్చాయి. మరో 11.25 లక్షల మంది రైతులకు రుణాలు అందలేదు.
సర్కారు నిర్లక్ష్యం కూడా..
రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 93.47 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అందులో సగం ఒక్క పత్తి సాగే కావడం గమనార్హం. ఈ సారి ఏకంగా 46.52 లక్షల ఎకరాల్లో (సాధారణంతో పోలిస్తే 111 శాతం) పత్తిని సాగు చేశారు. దీంతో పెద్ద ఎత్తున రైతులకు రుణాలు కావాల్సిన అవసరమేర్పడింది. పత్తి వాణిజ్య పంట కావడం, కాయతొలుచు పురుగు ఆశించడంతో పురుగు మందులు, ఎరువులు, ఇతర వ్యయాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
అయితే బ్యాంకర్లు మాత్రం రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ తీరు కారణమంటూ వేలెత్తి చూపుతున్నారు. రుణాలు ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని.. కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల బకాయిల సొమ్ము రూ.271 కోట్లు ఇంకా చెల్లించలేదని అంటున్నారు. మరోవైపు కొత్త రుణాల సంగతి పక్కన పెడితే.. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలకు సంబంధించి వడ్డీ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల కొత్త రుణం ఇస్తూనే.. ఆ రుణం సొమ్ము నుంచి వడ్డీని కత్తిరిస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్యాంకుల మొండిపట్టు రైతుల పాలిట శాపంగా మారాయి.
సహకార బ్యాంకులు నయం
తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ఆధ్వర్యంలోని సహకార బ్యాంకుల ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2,900 కోట్లుకాగా.. ఇప్పటివరకు రూ.2,100 కోట్లు మంజూరు చేశాయి. వాణిజ్య, ప్రైవేటు బ్యాంకులు మాత్రం పక్కా వ్యాపార దృష్టితోనే వ్యవహరి స్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. రైతులు ప్రధానంగా ప్రైవేటు, వాణిజ్య బ్యాంకుల మీదే ఆధారపడతారు. వాటి శాఖలు విరివిగా ఉండటంతో అటువైపే మొగ్గుచూపుతారు.
11.25 లక్షల మంది రైతులకు మొండిచెయ్యి
Published Sat, Sep 2 2017 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement