'ఆయన అంత పెద్ద నాయకుడు కాదు' | Sakshi
Sakshi News home page

'ఆయన అంత పెద్ద నాయకుడు కాదు'

Published Sat, Mar 5 2016 12:29 PM

china rajappa comments on mudragada

హైదరాబాద్: కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం ఫోన్ ట్యాప్ చేసేంత పెద్దనాయకుడు కాదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి  చినరాజప్ప ఎద్దేవా చేశారు. ముద్రగడ దీక్షను ప్రభుత్వం పట్టించుకోదని ఆయన తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చట్ట ప్రకారం చర్యతీసుకుంటారని చినరాజప్ప అన్నారు.

మంత్రి రావెల కిషోర్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై చినరాజప్ప మాట్లాడుతూ.. తప్పుచేసినట్లు తేలితే తెలంగాణ ప్రభుత్వం ఆయనపై చట్టప్రకారం చర్య తీసుకుంటుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రి స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement