సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బిజీబిజీగా గడిపారు. సీఎంను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖులతో క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు సందడి నెలకొంది. ఉదయం నుంచే పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రముఖులు సీఎంను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేవస్థానాల నుంచి వచ్చిన పండితులు సీఎంను ఆశీర్వదించారు.
సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణ నుమాయిష్ (ఎగ్జిబిషన్)ను సీఎం ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం, చందూలాల్, తుమ్మల, ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి, మహేందర్రెడ్డి, జోగురామన్న, తలసాని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ, టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి, సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు సీఎంను కలిశారు.
లక్ష్యానికి తగిన విద్యుత్
శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన విద్యుత్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఈ ఏడాది తొలి సమీక్ష నిర్వహించారు. రైతులకు వచ్చే ఖరీఫ్ నుంచి పగటిపూట తొమ్మిది గంటలు, ఇతర వర్గాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,445 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని, ఈ ఏడాది చివరి నాటికి మరో 4,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యానికి తగినట్లుగా పనులు చేయాలని ఆదేశించారు. భూపాలపల్లిలో 600 మెగావాట్ల యూనిట్ను ఈనెల 5న ప్రారంభించడంతో పాటు ఏప్రిల్ నాటికి జైపూర్ నుంచి సింగరేణి ప్లాంట్ ద్వారా 1,200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు.
ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ కూడా ఈ ఏడాది చివరినాటికి అందుతుందని... ఏప్రిల్ నాటికే 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతో బీహెచ్ఈఎల్ ద్వారా నిర్మించే విద్యుత్ ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకోవాలని సీఎం పేర్కొన్నారు. నిర్ణీత లక్ష్యాల మేరకు విద్యుత్ అధికారులు పనిచేస్తున్నారని అభినందించారు.
టీజీవో డైరీ ఆవిష్కరణ
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, టీజీవో నేత మమతతో పాటు సంఘం నాయకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్కు శుభాకాంక్షలు సీఎం
కేసీఆర్ శుక్రవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్కు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యాలన్నీ విజయవంతం కావాలని, ప్రజలంతా ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.
తొలిరోజు సీఎం కేసీఆర్ బిజీబిజీ
Published Sat, Jan 2 2016 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement