‘మీరూ సహాయక చర్యల్లో పాల్గొనండి’ | Sakshi
Sakshi News home page

‘మీరూ సహాయక చర్యల్లో పాల్గొనండి’

Published Fri, Sep 23 2016 6:52 PM

‘మీరూ సహాయక చర్యల్లో పాల్గొనండి’ - Sakshi

హైదరాబాద్: అతిగా కురిసిన వర్షాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం జతకావడంతో అవస్థల పాలైన ప్రజలను ఆదుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ముందుకు రావాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వర్షం, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. బాధితులకు తాగునీరు, భోజన వసతి కల్పనకు తగిన చర్యలు ప్రభుత్వ సిబ్బందితో కలిసి తీసుకోవాలని కోరారు.

గతంలో తుఫానులు, వరదలు వచ్చినపుడు బీజేపీ కార్యకర్తలు ముందుండి సహాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు కష్టాలో ఉన్నపుడు ఆదుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. భారీవర్షాలకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, ఇతర చోట్ల జనజీవనం అస్తవ్యస్తమైందన్నారు. కాలనీలకు కాలనీలే నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వారికి సాయం అందించి ఆదుకోవాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement