♦ పార్టీ మారిన వారిపై అనర్హత వేటు పడడం ఖాయం
♦ ఆ స్థానాల్ల్లో ఉప ఎన్నికలు వచ్చే వరకూ పోరాడుతాం
♦ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి పచ్చ కండువాలు కప్పగానే పని అయిపోయిందని అనుకోకండి చంద్రబాబూ! అన్నీ బయటకు వస్తాయి. నువ్వు ఎవరెవరితో మాట్లాడిస్తున్నావు, ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వజూపుతున్నావో ఆధారాలు బయటకు రాబోతున్నాయి... జాగ్రత్త’’ అని వెఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తాను పంపిన డబ్బు సక్రమంగా చేరుతుంది. వాళ్లందరూ చేరుతున్నారు.
అంతా సక్రమంగా జరుగుతోందని చంద్రబాబు అనుకుంటున్నారు. లీక్లు ఉంటాయి. దొంగలు ఆధారాలు వదిలే వెళ్తారు. అన్నీ బయటకు వస్తాయి’’ అని అంబటి చెప్పారు. వైఎస్సార్సీపీ పని అయిపోయిందంటూ టీడీపీ చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కష్టాల్లో పుట్టిన పార్టీ మాది. ఎండకు ఎండింది. వానకు తడిసింది. చలికి వణికింది. అయినా 67 సీట్లలో గెలిచింది. ప్రధాన ప్రతిపక్షంగా మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్న వైఎస్సార్సీపీతో మైండ్ గేమ్ ఆడుతారా?’’ అని ధ్వజమెత్తారు. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు నైతిక విలువలుంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని, ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వచ్చే వర కు పోరాడుతామని స్పష్టం చేశారు.
వారు ఎటు ఓటు వేస్తారు?
శాసనసభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమని.. ఓటింగ్ వచ్చినప్పుడు పార్టీ విప్ జారీ చేయడం సాధారణమని అంబటి చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అప్పుడు ఎటు ఓటు వేస్తారో చూద్దామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కన్నా, వారి దగ్గర ఉన్న డబ్బుల కన్నా ప్రజాస్వామ్యం బలమైందని నిరూపితం కాబోతోందన్నారు.
తప్పు చేసింది బాబే..
‘‘తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టే చంద్రబాబు తన పార్టీని కేసీఆర్కు దాసోహం చేశారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఏ తప్పూ చేయలేదు కాబట్టే సోనియాగాంధీపై సైతం రాజీ పడకుండా పోరాడారు. 16 నెలలు జైల్లో ఉన్నా తలవంచని వ్యక్తి జగన్’’ అని అంబటి కొనియాడారు.
Related news
-
నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు. ఈ ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేయకపోతే నా గూండాయిజం మళ్లీ చూస్తారు. నా వెంట లేకపోతే మీ అంతు చూస్తా.. ఖబడ్దార్.. ఈ డైలాగ్లు ఏదో యాక్షన్ సినిమాలో వీధి రౌడీ చెప్పిన మాటలు కాదు.. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు గుణవంతుడని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అక్రమాల గణబాబు హెచ్చరికలు. ఓటమి భయంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగైతే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారో.. అదే తానుముక్కైన గణబాబు కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం : ప్రచారం పేరుతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గణబాబు వస్తున్నాడంటే వ్యాపారులు బెదిరిపోతున్నారు. చిన్న చిన్న దుకాణదారులు హడలిపోతున్నారు. బడా బంగారు వ్యాపారులు భయపడుతున్నారు. ఆర్పీ లు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై తోపుడు బళ్లు వ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరు కనిపించినా.. నవ్వుతూ పలకరిస్తూ.. ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ ఓటర్లను అభ్యర్థిస్తుంటే.. టీడీపీ అభ్యర్థి గణబాబు మాత్రం బెదిరింపు రాజకీయాలతో బెదరగొడుతున్నారు.బెదిరింపులకు నాలుగు బ్యాచ్లు ఎన్నికల్లో తనకు సహకరించకపోతే భవిష్యత్లో సమస్యలు తప్పవని గణబాబు.. నియోజకవర్గంలోని వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల యజమానులను బెదిరిస్తున్నారని కొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులను బెదిరించేందుకు గణబాబు తన అనుచరులను నాలుగు బ్యాచ్లుగా విభజించి.. వస్త్ర వ్యాపారుల ను ఒక బ్యాచ్, బంగారు వ్యాపారులను మరో బ్యాచ్, కిరాణా దుకాణాలవైపు ఇంకో బ్యాచ్, మిగిలిన వాటిని కవర్ చేస్తూ మరో బ్యాచ్ పశ్చిమ నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. ఆయా వర్తక సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను గణబాబు రప్పించుకొని వేలు చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తి గెలిస్తే నియోజకవర్గాన్ని గూండాల చేతిలో పెట్టేటట్లుగా ఉన్నారంటూ వ్యాపారులు హడలిపోతున్నారు.ఫిర్యాదులు చేస్తామని ఆర్పీలకు బెదిరింపు స్వయం సహాయక బృందాల్లో కీలకంగా వ్యవహరించే రిసోర్స్ పర్సన్స్(ఆర్పీ) ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకుండా వ్యవహరిస్తున్నారు. అయితే.. వీరిపైనా గణబాబు బెదిరింపుల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలే కొందరు ఆర్పీలను మభ్యపెట్టేందుకు కాసులపేర్లను బహూకరించారు. ఆర్పీలు తీసుకోమని చెప్పడంతో వారందర్నీ బెదిరించారు. దీంతో ఒకరిద్దరు గణబాబు గూండాయిజానికి భయపడి తీసుకున్నారు. మిగిలిన వారు మాత్రం తాము ఏ పార్టీకి సపోర్ట్ చేయమనీ.. స్వయం సహాయక బృందాల అభివృద్ధి కోసమే తమని ప్రభుత్వాలు నియమించాయని కరాఖండిగా చెప్పడంతో గణబాబు అహం దెబ్బతింది.దీంతో తనకు సహకరించని ఆర్పీలపై గణబాబు వర్గం ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోల్ని సంపాదించి.. ఆ ఫొటోలతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కొందరు ఆర్పీలు వాపోతున్నారు. పాత ఫొటోల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముందుగా ఆర్పీలకు ఆ ఫొటోలు చూపించి.. మీరు తన తరఫున ప్రచారం చేయకపోతే.. ఈ ఫొటోలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాననీ.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ గణబాబు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గణబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గాన్ని కుదిపేస్తున్నాయి. దిగజారుడు బెదిరింపులతో చిల్లర రాజకీయాలు చేస్తున్న గణబాబు అరాచకాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. -
చంద్రబాబు హామీలపై విరుచుకుపడ్డ సజ్జల..
చంద్రబాబు హామీలపై విరుచుకుపడ్డ సజ్జల.. -
సీఎం జగన్ పై కుట్రలే ఎజెండాగా చంద్రబాబు ప్రచారం
సీఎం జగన్ పై కుట్రలే ఎజెండాగా చంద్రబాబు ప్రచారం -
మేనిఫెస్టోలో చెప్పినదానికి మించి కాపులకు భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడూ ముందడుగే. ఏ వర్గానికి చేసిన మేలయినా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు కానీ, ఒక్క రూపాయి తక్కువ చేయలేదు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజలకు సీఎం జగన్ ఈ ఐదేళ్లలో చేసిన మేలు, కల్పించిన ప్రయోజనాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూడా ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో చేయకుండా ఆ వర్గ ప్రజలను వంచించారు. కాపు సామాజిక వర్గం ప్రజలను చంద్రబాబు వేధించిన తీరు అందరికీ ఇప్పటికీ కళ్లకు కడుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపుల దశ తిరిగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే వాస్తవంగా ఈ ఐదేళ్లలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి చేసిన మొత్తం ఆర్థిక సాయం రూ.34,005.12 కోట్లు. అంటే చెప్పినదానికంటే రూ. 24 వేల కోట్లు ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కల్పించారు. డీబీడీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.93 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ఆర్థిక ప్రయోజనాలను కాపులకు అందించారు. చంద్రబాబు గతంలో ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కాపులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా చంద్రబాబు పాలన ఐదేళ్లలో కాపులకు కేవలం రూ.1,340 కోట్లే కేటాయింపులు చేశారు. అంటే ఇచ్చిన హామీని నెరవేర్చనేలేదు. రూ.5 వేల కోట్లలో పావు వంతే కేటాయింపులు చేసి, కాపు వర్గాలను మోసం చేశారు. అంతే కాదు.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన వారిపై చంద్రబాబు తన పాలనలో ఉక్కుపాదం మోపారు. ఆఖరికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, వారి కుటుంబసభ్యులను ఇంట్లోనే నిర్బధించడంతో పాటు ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టి వేధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. అంతే కాకుండా ఏకంగా నలుగురు కాపు వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అర్హతగల కాపులందరినీ నవరత్నాల పథకాలకు ఎంపిక చేశారు. సిఫార్సులు, లంచాలకు తావులేకుండా, పార్టీలకు అతీతంగా కాపు సోదరులు, కాపు సోదరిలకు సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం అందించారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,58,613 మంది కాపు మహిళలకు రూ.2029.92 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ ఇంత ఆర్థిక సాయం అందుకోవాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉంటేనే సాధ్యం అవుతుందనేది జగమెరిగిన సత్యం. -
మండుటెండల్లోనూ జన సునామీ
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఎన్నికల మలి విడత ప్రచారానికి జనం పోటెత్తారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రను తలపిస్తూ వెల్లువలా తరలివచ్చారు. ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలకు మండుటెండల్లోనూ ప్రజలు ప్రభంజనంలా కదిలివచ్చారు. తీవ్ర ఎండను, ఉక్కపోతను ఖాతరు చేయకుండా సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తితో విన్నారు. గత 58 నెలల్లో చేసిన మంచిని సీఎం వివరించారు.ఈ పథకాలు మళ్లీ కొనసాగాలన్నా.. మరింత మేలు జరగాలన్నా.. పేదింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన కావాలన్నా.. మన పిల్లల బడులు బాగుపడాలన్నా.. ఆస్పత్రులు, వ్యవసాయం మరింత మెరుగుపడాలన్నా మన ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కడానికి మీరంతా సిద్ధమేనా అని సీఎం జగన్ అడగ్గా మేమంతా సిద్ధమేనంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రజలు నినదించారు. లక్షలాది మంది పిడికిళ్లు ఒక్కసారిగా పైకి లేపడంతో తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు దద్దరిల్లిపోయాయి. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలూ పూర్తి స్థాయిలో ఆమోదించారనడానికి మూడు సభల్లో ఉవ్వెత్తున ఎగిసిన జనకెరటాలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రచారాలకు జనస్పందన కనిపించడం లేదు. మొన్న సిద్ధం సభలు.. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేడు మలి విడత ప్రచారంలో తొలి రోజు నిర్వహించిన సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీదే అధికారమని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు.తరలివచ్చిన తాడిపత్రి.. ఎన్నికల మలి విడత ప్రచారానికి అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు గ్రామాలకు గ్రామాలు తరలివచ్చారు. హెలీప్యాడ్ నుంచి సభ జరిగే వైఎస్సార్ సర్కిల్కు చేరుకునే వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట వేలాది మంది పరుగులు తీశారు. సభా ప్రాంగణానికి ఉదయం 11.55 గంటలకు చేరుకునే సరికి ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అప్పటికే 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా తెచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం జగన్ వివరించారు. 2014–19 మధ్య బీజేపీ, జనసేనతో కూటమి కట్టి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు అదే కూటమి కట్టి అడ్డగోలు హామీలు ఇస్తూ వస్తున్న చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తలపెట్టడమేనని చాటిచెబుతూ సీఎం చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.వెల్లువెత్తిన వెంకటగిరి..తిరుపతి జిల్లా వెంకటగిరిలో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న వేలాది మంది ప్రజలు వెల్లువలా పోటెత్తారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రత, విపరీతమైన ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నా వెనుకడుగేయలేదు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి మధ్యాహ్నం 2.25 గంటలైంది. దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా జనం నిల్చున్న ప్రాంతం నుంచి కదల్లేదు. సీఎం జగన్ను చూడగానే హర్షధ్వానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని.. మన తలరాతలు మారుస్తాయని.. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది.. ఎవరితో ఆ మంచి కొనసాగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దీంతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదిస్తూ వేలాది మంది ఒక్కసారిగా జయజయధ్వానాలు చేశారు.కదిలివచ్చిన కందుకూరునెల్లూరు జిల్లా కందుకూరులో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ఉంటుందని తెలుసుకున్న ఆ నియోజకవర్గ ప్రజలు ఉదయం 10 గంటల నుంచే భారీ ఎత్తున కదిలివచ్చారు. దాంతో మధ్యాహ్నం 12 గంటలకే కందుకూరు జనసంద్రంగా మారింది. కందుకూరులో హెలీప్యాడ్ నుంచి సభ జరిగే కేఎంసీ సర్కిల్ వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట జనం పరుగులు తీశారు. ఆయనను దగ్గరి నుంచి చూసేందుకు పోటీపడ్డారు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి సాయంత్రం 4 గంటలైంది. అప్పటికి 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అంతటి ఎండలోనూ గంటలకొద్దీ నిలబడ్డ జనం సీఎం జగన్ను చూడగానే ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రసంగాన్ని జనం శ్రద్ధగా విన్నారు. ‘సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చంద్రబాబులా బడాయి మాటలు నేను చెప్పడం లేదు. 58 నెలల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు ఉంచి మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతున్నాడు’ అని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. దీనికి ప్రజలు సైతం శ్రుతి కలపడం విశేషం. మండుటెండల్లోనూ, తీవ్రమైన ఉక్కపోతల్లోనూ మూడు సభలకు పోటాపోటీగా జనం కదిలిరావడం.. ఒకదానికి మించి ఒకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో రాబోయేది ఫ్యాన్ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ప్రచారం సాగే కొద్దీ వైఎస్సార్సీపీ ప్రభంజనం అంతకంతకూ పెరగడం ఖాయమని.. ఇది చూసి పోలింగ్కు ముందే కూటమి నేతలు, శ్రేణులు కాడి పారేయడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు.
Related News by category
-
బెదిరింపుల పర్వం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే, దరిదాపుల్లో కూడా నిలవలేం. అవకాశం ఉన్న చోట పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించుకునే చర్యలు చేపట్టాలి. అందుకు ఎవరి స్థాయిలో వారు పనిచేయండి. నా ప్రమేయం అవసరమైన చోట చెప్పండి. నేనే స్వయంగా రంగంలోకి దిగుతా. నయానో.. భయానో ఈమారు అనుకూలంగా మలుచుకోవాలి. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వర్తించండి. మరీ ముఖ్యంగా ఈ ఏడు గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.. అని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు దిశా–నిర్దేశం చేశారు. ఆపై బెదిరింపుల పర్వానికి తెరలేపుతున్నారు. దేవగుడి పరిసర ప్రాంతాలైన గొరిగెనూరు, ధర్మాపురం, సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు, సుగమంచిపల్లె, శేషారెడ్డిపల్లె, శిరిగేపల్లె గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులుగా ఉన్నప్పుడు ఆయా గ్రామాల ప్రజలు దేవగుడి కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. దేవగుడి సోదరులు తెలుగుదేశం పారీ్టలో చేరిన తర్వాత అదే గ్రామాలకు చెందిన వారు వైఎస్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చాక, ఇప్పుడు అవే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సోదరులను ఆయా నేతలపైకి ఉసిగొల్పారు. సౌమ్యంగా మద్దతు కోరండి, డబ్బు ఆశ చూపండి, అప్పటికీ మీమాట వినని వారితో నేను స్వయంగా మాట్లాడతా.. తర్వాత దౌర్జన్యం చేసేందుకు కూడా వెనుకడవద్దని వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఆ ఏడు గ్రామాలకు చెందిన నాయకులతో వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ మంచిగా మద్దతు కోరుతున్నట్లు సమాచారం. రాబోవు రోజుల్లో మరింత స్పీడు పెంచి భయపెట్టుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే దరిదాపుల్లో కూడా పోటీలో నిలువలేమనే అంచనాకు దేవగుడి సోదరులు వచ్చినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో దాదాపు 87 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందినట్లు గుర్తించారు. ఓటుకు వెళ్తే అభ్యర్థులతో నిమిత్తం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా వైఎస్సార్సీపీకి మద్దతు లభిస్తున్నట్లు గ్రహించారు. ఇక పాత తరహాలో పోలింగ్ చేపట్టకపోతే ఉపయోగం లేదనే అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే మైలవరం మండలంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ సర్పంచ్పై బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీకి ప్రచారం వరకే పరిమితం కావాలని, పోలింగ్కు మూడు రోజుల ముందు నుంచి గ్రామంలో ఉండొద్దని హెచ్చరించినట్లు తెలిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే సూత్రాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పాత రోజులను గుర్తు చేయవద్దనే తరహాలో బెదిరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పరిస్థితిని బట్టి డబ్బులకు మెత్తబడే వారిని డబ్బుతో వశపరుచుకోవాలని, అలా కాదన్నవారి విషయాలపై దౌర్జన్యాకు సైతం వెనుకాడవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టి గ్రామస్థాయి నేతలు భయభాంత్రులకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
ఎంవీపీ కాలనీ: ‘మీ సమస్య ఏదైనా.. ఏ అవసరమొచ్చినా బొత్స సత్తిబాబు మీ వెంట ఉన్నాడు. అన్నదమ్ముడిగా మీ మధ్య పెరిగాను.. మీ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఈ స్థాయికి చేరాను.. ఆ ఆదరణ ఎల్లప్పుడూ నాకు, మా పార్టీకి కావాలి’అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వాసుల ఎదుట తన ఆకాంక్షను వెల్లడించారు. విశాఖ నగరంలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల ఆత్మీయ సమావేశం లాసన్స్ బే కాలనీలోని వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో జరిగింది.మంత్రితో పాటు బొత్స ఝాన్సీ పాల్గొని ఉత్తరాంధ్ర వాసులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లో సేవలు అందించానన్నారు. ఇందుకు అనుగుణంగానే ఉత్తరాంధ్ర ప్రజానీకం తనకు, తన కుటుంబానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా తమ నుంచి మునుపటి భరోసాను పొందవచ్చునన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఉత్తరాంధ్ర ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేసి అఖండ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీ ఉండాలన్నదే సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మంత్రి బొత్స పేర్కొన్నారు.ఇందుకు అనుగుణంగానే అవినీతికి తావులేకుండా రాష్ట్ర ప్రజలకు ఐదేళ్లుగా సుపరిపాలన అందించడంతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీఎం జగన్ వంటి నాయకుడు దేశ రాజకీయ చరిత్రలో లేరన్నారు. మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు నమ్మకం, భరోసా, ధైర్యం అందించారన్నారు. ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ఎలాంటి బూటకపు హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చిడమే సీఎం జగన్ అజెండా అన్నారు. లక్ష కోట్లతో విజన్ విశాఖ పేరిట నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ఉత్తరాంధ్ర వాసులు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, తదితరులు పాల్గొన్నారు. -
నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు. ఈ ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేయకపోతే నా గూండాయిజం మళ్లీ చూస్తారు. నా వెంట లేకపోతే మీ అంతు చూస్తా.. ఖబడ్దార్.. ఈ డైలాగ్లు ఏదో యాక్షన్ సినిమాలో వీధి రౌడీ చెప్పిన మాటలు కాదు.. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు గుణవంతుడని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అక్రమాల గణబాబు హెచ్చరికలు. ఓటమి భయంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగైతే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారో.. అదే తానుముక్కైన గణబాబు కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం : ప్రచారం పేరుతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గణబాబు వస్తున్నాడంటే వ్యాపారులు బెదిరిపోతున్నారు. చిన్న చిన్న దుకాణదారులు హడలిపోతున్నారు. బడా బంగారు వ్యాపారులు భయపడుతున్నారు. ఆర్పీ లు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై తోపుడు బళ్లు వ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరు కనిపించినా.. నవ్వుతూ పలకరిస్తూ.. ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ ఓటర్లను అభ్యర్థిస్తుంటే.. టీడీపీ అభ్యర్థి గణబాబు మాత్రం బెదిరింపు రాజకీయాలతో బెదరగొడుతున్నారు.బెదిరింపులకు నాలుగు బ్యాచ్లు ఎన్నికల్లో తనకు సహకరించకపోతే భవిష్యత్లో సమస్యలు తప్పవని గణబాబు.. నియోజకవర్గంలోని వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల యజమానులను బెదిరిస్తున్నారని కొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులను బెదిరించేందుకు గణబాబు తన అనుచరులను నాలుగు బ్యాచ్లుగా విభజించి.. వస్త్ర వ్యాపారుల ను ఒక బ్యాచ్, బంగారు వ్యాపారులను మరో బ్యాచ్, కిరాణా దుకాణాలవైపు ఇంకో బ్యాచ్, మిగిలిన వాటిని కవర్ చేస్తూ మరో బ్యాచ్ పశ్చిమ నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. ఆయా వర్తక సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను గణబాబు రప్పించుకొని వేలు చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తి గెలిస్తే నియోజకవర్గాన్ని గూండాల చేతిలో పెట్టేటట్లుగా ఉన్నారంటూ వ్యాపారులు హడలిపోతున్నారు.ఫిర్యాదులు చేస్తామని ఆర్పీలకు బెదిరింపు స్వయం సహాయక బృందాల్లో కీలకంగా వ్యవహరించే రిసోర్స్ పర్సన్స్(ఆర్పీ) ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకుండా వ్యవహరిస్తున్నారు. అయితే.. వీరిపైనా గణబాబు బెదిరింపుల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలే కొందరు ఆర్పీలను మభ్యపెట్టేందుకు కాసులపేర్లను బహూకరించారు. ఆర్పీలు తీసుకోమని చెప్పడంతో వారందర్నీ బెదిరించారు. దీంతో ఒకరిద్దరు గణబాబు గూండాయిజానికి భయపడి తీసుకున్నారు. మిగిలిన వారు మాత్రం తాము ఏ పార్టీకి సపోర్ట్ చేయమనీ.. స్వయం సహాయక బృందాల అభివృద్ధి కోసమే తమని ప్రభుత్వాలు నియమించాయని కరాఖండిగా చెప్పడంతో గణబాబు అహం దెబ్బతింది.దీంతో తనకు సహకరించని ఆర్పీలపై గణబాబు వర్గం ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోల్ని సంపాదించి.. ఆ ఫొటోలతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కొందరు ఆర్పీలు వాపోతున్నారు. పాత ఫొటోల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముందుగా ఆర్పీలకు ఆ ఫొటోలు చూపించి.. మీరు తన తరఫున ప్రచారం చేయకపోతే.. ఈ ఫొటోలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాననీ.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ గణబాబు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గణబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గాన్ని కుదిపేస్తున్నాయి. దిగజారుడు బెదిరింపులతో చిల్లర రాజకీయాలు చేస్తున్న గణబాబు అరాచకాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. -
రంగారెడ్డి జిల్లా.. విభిన్నతల ఖిల్లా!
సాక్షి, హైదరాబాద్: పల్లె.. పట్నం కలబోత. భౌగోళికంగా ఏడు జిల్లాల సరిహద్దులతో విస్తరించి ఉన్న అరుదైన ఘనత. తెలంగాణలోనే శరవేగంగా విస్తరిస్తోంది రంగారెడ్డి జిల్లా. ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతోంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ జిల్లా ప్రస్తుతం కొంత విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలంగాణలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లా అయిదు లోక్సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉండటం.. ఇటు రాజకీయంగానే కాదు అటు పరిపాలనా పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో కొనసాగుతుండటంతో ఎన్నికల రిటరి్నంగ్ అధికారులకే కాదు, పోలీసు యంత్రాంగానికి కొత్త చిక్కులు తప్పడం లేదు. దేశంలోనే మొదటి స్థానంలో మల్కాజిగిరి.. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జాబితాలో మల్కాజిగిరి మొదటిస్థానంలో ఉంది. మల్కాజిగిరి. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కంటోన్మెంట్, మేడ్చల్ సహా జిల్లాలోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 37,28,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎల్బీనగర్ ఓటర్లే 6,00,552 మంది ఉండటం విశేషం. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో జిల్లా పరిధిలోని ఎల్బీనగర్కు చెందిన ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణలో చేవెళ్ల రెండోది.. తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న రెండో అతిపెద్ద లోక్సభ స్థానంగా చేవెళ్లకు గుర్తింపు ఉంది. వికారాబాద్, పరిగి, తాండురు సహా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మొత్తం 29,19,465 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లికి చెందిన వారే 21,72,811 మంది ఓటర్లు ఉండటం గమనార్హం. అక్కడి అభ్యర్థులు..ఇక్కడి ఓటర్లు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్సభ స్థానంలో 18,04,930 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఒక్క ఇబ్రహీంపట్నంలోనే 3,37,134 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఇక్కడే ఉండటం, అభ్యర్థుల గెలుపోటములు వీరిపైనే ప్రధానంగా ఆధారపడ్డాయి. ⇒ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్సభ స్థానంలో మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉండగా, వీరిలో కల్వకుర్తికి చెందిన వారు 2,43,098 మంది ఉన్నారు. ⇒ షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ స్థానంలో 16,80,417 మంది ఓటర్లు ఉండగా, వీరిలో షాద్నగర్ ఓటర్లే 2,38,392 మంది ఉన్నారు. ఆయా పారీ్టల అభ్యర్థుల జయాపజయాలను జిల్లా ఓటర్లే నిర్దేశించనున్నారు. -
ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయ్బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో అసెంబ్లీ ప్రతినిధులు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.రాయ్బరేలీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేకు టికెట్ ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. ప్రస్తుతానికి ప్రియాంకగాంధీ పేరు ఫైనల్ అయినట్లు భావిస్తున్నప్పటికీ, అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.రాయ్బరేలీ లోక్సభ ఎన్నికల కోసం సోనియా గాంధీ ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీతోపాటు ఆమె ప్రతినిధి కేఎల్ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, బచ్రావాన్ ఎమ్మెల్యే సుశీల్ పాసి, హర్చంద్పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్సింగ్, డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సరేని ఎమ్మెల్యే సుధా ద్వివేది, అతుల్ సింగ్, ఉంచహార్ ఎమ్మేల్యే సాహబ్ శరణ్ పాశ్వాన్, రాయ్బరేలీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ అధ్యక్షురాలు సరితా గుప్తా, రాయ్ బరేలీ మాజీ అధ్యక్షుడు ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కళ్యాణ్ సింగ్ గాంధీ, డీడీసీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లాలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాధన మిశ్రా రాయ్బరేలీ ఎన్నికల్లో వ్యూహకర్తలుగా కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement