8 వారాల్లో జమ చేయాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ టి.కె.శ్రీదేవికి హైకోర్టు రూ. 1,116 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థకు ఎనిమిది వారాల్లో జమ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో ఏడు రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమవారం తీర్పు వెలువరించారు. మహబూబ్నగర్లోని సరస్వతి ఫెర్టిలైజర్స్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ తనిఖీలు నిర్వహించి, స్టాకులో తేడా ఉండటంతో రూ. 50 లక్షల విలువ చేసే ఎరువులను సీజ్ చేశారు.
తరువాత పూర్తిస్థాయి విచారణ జరిపి రూ. 10 లక్షల విలువ చేసే స్టాకును సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ సరస్వతి ఫెర్టిలైజర్స్ యాజమాన్యం స్టానిక కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన స్థానిక కోర్టు జప్తు ఉత్తర్వులను సవరించి 20 శాతం స్టాకు జప్తునకు సమానమైన రూ. 44,302లను డిపాజిట్ చేయాలని పిటిషనర్ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పిటిషనర్ ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. అయినప్పటికీ స్టాకును విడుదల చేయకపోవడంపై సరస్వతి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని 30 రోజుల్లో స్టాకును విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ స్టాకును విడుదల చేయకపోవడంపై సరస్వతి యాజమాన్యం జిల్లా కలెక్టర్పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ రామలింగేశ్వరరావు జిల్లా కలెక్టర్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు తేల్చారు.
దిక్కార కేసులో కలెక్టర్ శ్రీదేవికి జరిమానా
Published Wed, Apr 27 2016 5:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement