హైదరాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లో భేటీ అయ్యారు. తెలంగాణ, ఏపీలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ఆపెక్స్ కమిటీ భేటీ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలను దత్తాత్రేయ దృష్టికి హరీశ్ తీసుకెళ్లారు. రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని కేంద్రమంత్రిని ఆయన కోరారు. దీనికి దత్తాత్రేయ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.