హైదరాబాద్: బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్యాంప్ ఆఫీస్ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఏపీ సీఐడీ అధికారులు.. మంత్రి కేటీఆర్ గన్మన్, కారు డ్రైవర్లకు నోటీసులు ఇవ్వజూసిన క్రమంలో ఈ తతంగం జరిగింది.
ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పాలంటూ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్యను బెదిరించారని, దీనికి సంబంధించి తమ ఎదుట విచారణకు హాజరుకావాలని మంత్రి కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లు అయిన జానకీరామ్, సత్యనారాయణలకు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ అధికారులు రాత్రి సమయంలో సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే క్యాంప్ ఆఫీస్ భద్రతా సిబ్బంది.. ఏపీ సీఐడీ అధికారుల్ని గేటు వద్దే అడ్డుకుని అలాంటి పేర్లు గల వ్యక్తులెవరూ ఇక్కడ లేరని వెనక్కి పంపించారు.
దీనికి ప్రతిగా ఓ సారి లోపలికి వెళ్లి చూసొస్తామని ఏపీ అధికారులు అనడంతో.. అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ లోనికి అనుమతించేదిలేదంటూ భద్రతా సిబ్బంది తేల్చిచెప్పారు. అంతేకాదు మీరు ఇచ్చే నోటీసులు తీసుకోబోమన్నారు. దీంతో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వెనుదిరిగిన ఏపీ సీఐడీ అధికారులు కొద్దిసేపటి తర్వాత మళ్లీ అలాంటి ప్రయత్నమే చేశారు. అప్పుడు కూడా భద్రతా సిబ్బంది ఏపీ అధికారుల్ని లోనికి అనుమతించలేదు. కాగా, రెండోసారి వారు రావడానికి కొద్ది క్షణాల ముందే సీఎం కాన్వాయ్ క్యాంప్ ఆఫీస్ లోపలికి ప్రవేశించడం గమనార్హం.
ఇంతటితో ముగిసిందనుకున్న హైడ్రామా నందినగర్ లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద మళ్లీ మొదలైంది. కేటీఆర్ క్యాంప్ కార్యాలయం (కేసీఆర్ స్వగృహం) వద్దకు చేరుకున్న ఏపీ సీఐడీ అధికారులు కేటీఆర్ గన్ మన్, కారు డ్రైవర్లను గురించి అక్కడున్న భద్రతా సిబ్బందిని వాకబు చేశారు. అలాంటి పేర్లున్నవారెవరూ లేరని చెప్పడంతో మళ్లీ వెనుదిరిగిపోయారు. గారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ మేం తాకేదే లేదన్నారు. 'మేము నోటీసులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తులెవరూ ఇక్కడ లేరని భద్రతా సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగి వెళ్తున్నాం' అని ఏపీ సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద హైడ్రామా
Published Wed, Aug 12 2015 10:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement