20 నుంచి 23 తేదీల్లో కిషన్రెడ్డి బొగ్గుబావుల పర్యటన
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల పరిధిలోని ఆయా జిల్లాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్య సింగరేణి జిల్లాల్లో బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి బొగ్గుబావుల పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడ పార్టీ నాయకులు ఎస్.కుమార్, డాక్టర్ ప్రకాశ్రెడ్డి, ఎన్వీ ప్రకాశ్, సుధాకర శర్మలతో కలసి ‘కిషన్రెడ్డి బొగ్గుబావుల పర్యటన’ పోస్టర్ను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నుంచి ఆసిఫాబాద్ వరకు ఈ యాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్మికులకు వైద్య సదుపాయాల లేమి, ఆస్పత్రుల్లో వైద్యుల కొరత, ఇళ్లస్థలాల సమస్యలపై నిలదీస్తామన్నారు. సింగరేణి ప్రాంత రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, గోదావరి ప్రవహిస్తున్నా అక్కడి భూములకు నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సింగరేణి సమస్యలను తెలుసుకొని వాటిపై కేంద్రానికి నివేదికను కూడా సమర్పిస్తామని చెప్పారు. సింగరేణిలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య 56 వేలకు కుంచించుకుపోయినా సీఎం కేసీఆర్ స్పందన కరువైందన్నారు.
‘సింగరేణి’ హామీలను విస్మరించింది: బీజేపీ
Published Sat, Feb 18 2017 2:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement